పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు.
వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న మాజీ ఛైర్పర్సన్ పద్మావతి
ఏడు నెలల కిందటే ఆమె పదవీ కాలం పూర్తి
ఆర్టీసీ గ్రూపులో జోగి ప్రచార మెసేజ్
ఈనాడు, అమరావతి: తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇటీవల వరకు గ్రూప్లో వైకాపా ఎన్నికల ప్రచార చిత్రాలను పోస్టు చేశారు. తామేం తక్కువ కాదన్నట్లు వైకాపా అనుకూల యూనియన్ నేతలు కూడా పోటీపడి ఇందులో పోస్టులు పెడుతున్నారు. ఈ గ్రూప్లో ఉన్న ఆర్టీసీ అధికారులు కనీసం అభ్యంతరం చెప్పడం కానీ, దీని నుంచి బయటకు రావడం కానీ చేయకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిసినా ఎవరూ నోరుమెదపడం లేదు.
నిత్య ప్రచారం: పెనమలూరు నియోజకవర్గానికి చెందిన తాతినేని పద్మావతిని 2021లో విజయవాడ జోన్కు ఛైర్పర్సన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు స్వీకరించగానే.. ఆగస్టు, 2021లో ‘ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ బోర్డు’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. దీనికి ఆమెతో పాటు ఎన్ఎంయూ నేత అడ్మిన్లుగా ఉన్నారు. ఈ గ్రూప్లో ఎన్టీఆర్ జిల్లా ఆర్ఎం, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్ఎం, ఆటోనగర్, మచిలీపట్నం, గవర్నర్పేట-1, గవర్నర్పేట-2 డిపోల మేనేజర్లు, పలు కార్మిక సంఘాల నాయకులు 59 మంది సభ్యులుగా ఉన్నారు. సంస్థకు సంబంధించిన సర్క్యులర్లు, ఇతర సమాచారాన్ని పోస్టు చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. గత ఏడాది పద్మావతి పదవీ కాలం పూర్తయినా ఆమె ఆర్టీసీ గ్రూప్ను నిర్వహిస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చినా.. బేఖాతరు చేస్తూ మంత్రి, పెనమలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి జోగి రమేష్ ఎన్నికల ప్రచార చిత్రాలు, వీడియోలను ఇందులో పెద్ద ఎత్తున ఉంచారు. కొంతకాలం నుంచి ఆర్టీసీ ఉద్యోగులైన వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం, వైఎస్ఆర్ ఉద్యోగుల సమాఖ్య నాయకులు కొందరు వాట్సాప్ గ్రూప్లో రోజూ జగన్, జోగి అనుకూల ప్రచార చిత్రాలను పోస్టు చేస్తున్నారు. పెనమలూరులో పద్మావతి.. చేస్తున్న ప్రచార చిత్రాలను కూడా ఉంచుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఆర్టీసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం