రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి..
ఈనాడు, అమరావతి: గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ జనం నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక.. వారిపై దాడులకు తెగబడుతున్నారు. మొన్న నీటి కోసం గుడివాడ పట్టణ ప్రజలు నిలదీస్తే.. నేడు రహదారులు ఎందుకు వేయలేదంటూ గ్రామీణ ప్రాంతాల యువత నిలదీస్తున్నారు. దీన్ని తట్టుకోలేక నాని వర్గం దాడులకు దిగుతుంది. తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం కూరాడలో ఇలాంటి ఘటనే జరగ్గా.. దానిని బయటకు రాకుండా కొడాలి వర్గం వారిని బెదిరించారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి 10 గంటలు దాటాక.. కొడాలి నాని తన అనుచరులతో కలిసి కూరాడ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అదే సమయంలో కొందరు యువకులు కలిసి.. గత ఎన్నికల ముందు ఇలాగే వచ్చి.. గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్లే ప్రధాన రహదారిని బాగు చేస్తానంటూ నాని హామీ ఇచ్చారని, కానీ.. తర్వాత పట్టించుకోలేదంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేనే నిలదీస్తారా.. అంటూ ఆ యువకులను బూతులు తిడుతూ.. వైకాపా మూకలు నెట్టేసి కొట్టినట్లు తెలుస్తోంది. అయినా సదరు యువకులు ఏమాత్రం భయపడకుండా.. ‘ఎన్నిసార్లు ఇలా ఓట్ల కోసం వచ్చి మమ్మల్ని మోసం చేస్తారు.? గత ఐదేళ్లలో ఎమ్మెల్యే తమ గ్రామానికి చేసిందేం లేదు. అడిగితే తప్పా?’ అంటూ నిలదీసినట్టు తెలుస్తోంది.
కేసు పెట్టకుండా బెదిరింపులు
ప్రజా సమస్యలపై నిలదీస్తే తమను కొట్టడంపై సదరు యువకులు పోలీసు కేసు పెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. కానీ.. వారిని బెదిరించి కొడాలి నాని వర్గంతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కట్టడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన బయటకు రాకుండా దాచి ఉంచేందుకు ప్రయత్నించడం గమనార్హం. బుధవారం రాత్రి వరకూ ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.
ఒక్క రోడ్డూ వేయలేకపోయిన కొడాలి..
తెదేపా ప్రభుత్వ హయాంలోనే.. కేంద్ర, రాష్ట్రాలు కలిసి గ్రామాలన్నింటిలో 95 శాతానికి పైగా రహదారులను వేసేశాయి. మిగిలిన అరకొర దారులనూ వేయలేక వైకాపా సర్కారు చేతులెత్తేసింది. కొడాలి నాని ఐదేళ్ల కిందట మాట ఇచ్చి కూడా.. గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్లే ప్రధాన రహదారిని వేయలేదు. ఎన్నికలొస్తున్నాయని ఇటీవల గుంతలు మాత్రం పూడ్చారు. అదికూడా.. ఫ్లైయాష్, రబ్బీస్ గుంతల్లో పోసి వదిలేశారు. దీంతో అవి రాళ్లు తేలి, దుమ్ము ధూళితో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ.. వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి గురించే కూరాడ యువకులు కొడాలి నానిని నిలదీశారు. కానీ.. వారికి సమాధానం చెప్పలేక.. దౌర్జన్యానికి దిగడంపై.. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత ఐదేళ్లు ఎమ్మెల్యేగా నాని ఏ అభివృద్ధీ చేయకపోయినా.. ఓట్లు అడగడానికి రాగానే హారతులిచ్చి, పూలదండలు వేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం