కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం
‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి,
ఈనాడు, అమరావతి: ‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఓటింగ్లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తెదేపా, జనసేన, భాజపాలో ఉత్సాహం ఉరకలేసింది. కూటమి శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ కొనసాగనున్నా.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.’’
కోడూరులో పోలింగ్ను పరిశీలిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి
‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనం.. వైకాపా శ్రేణుల తీరు.. పోలింగ్ సరళి మేరకు.. వైకాపా శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమల్లో దాడులకు పాల్పడ్డారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పారు. కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోలింగ్ కేంద్రాల వరకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వారి కార్యకర్తలే నాయకులను నిలదీశారు. తమకు సొమ్ములు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. పార్టీ నుంచి వచ్చిన సొమ్ము నొక్కేశారా అని తీవ్ర గందరగోళం సృష్టించారు. మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, గుడివాడ, పెనమలూరు ప్రాంతాల్లో సొమ్ముల కోసం నిలదీశారు. వైకాపా నాయకులు చాలా మంది తెల్లమొహం వేశారు. విజయవాడ పశ్చిమలోనూ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.’’
విజయవాడ పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి కేశినేని చిన్నిపై అకారణంగా వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఏ.కొండూరు మండలం కంభంపాడులో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న చిన్నిపైకి కొందరు యువకులు దూసుకొచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అభ్యర్థికి అవకాశం ఉందని చెబుతున్నా.. అరుస్తూ నినాదాలు చేస్తూ గలాభా సృష్టించారు. ఆయన సంయమనం పాటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంత జరుగుతున్నా.. సాధారణ పోలీసులు అక్కడికి చేరుకోకపోవడం.. వారిని నివారించడం చేయలేదు. కంభంపాడులో పోలింగ్ సరళిపై అనుమానంతో కొందరు యువకులు ఈ అరాచకానికి పాల్పడ్డారని తెదేపా ఆరోపించింది.
నందిగామ: ఒక పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు అనవసరంగా కేకలు వేస్తూ.. చూసుకుందాం రా.. అని తెదేపా కార్యకర్తలకు సవాల్ విసిరారు. మద్యం మత్తులో ఉండి ఇలా ప్రవర్తించారంటే ఆయన భార్యకూడా జతకట్టడం విశేషం. ఘర్షణ కోసం తన అనుచరులను పిలిచి గోల చేసేందుకు యత్నించారు. తెదేపా కార్యకర్తలు చాల లైట్గా తీసుకున్నారు.
కంచికచర్ల: పరిటాలలో కొందరు మహిళలు మధ్యాహ్నం తర్వాత వైకాపాకు ఓటు వేయాలని డబ్బులు ఇస్తామని పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయడంపై తెదేపా వారు తీవ్ర అభ్యంతరం తెలపగా ఘర్షణకు కారణమైంది. పెనుగంచిప్రోలులో వైకాపా నేతలు కవ్వింపులకు దిగి తెదేపా వారిపై దాడి చేశారు. నందిగామ మండలంలో ఎమ్మెల్సీ తన అనుచరులతో హంగామా సృష్టించారు. .
బందరులో మరోసారి వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి తలకు బలమైన గాయమైంది. గతంలోనే తెదేపా కార్యకర్తలపై, జనసేన కార్యకర్తల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
గుడివాడలోనూ కవ్వింపులకు దిగారు. గుడివాడలో పోలింగ్ సరళిని చూసిన నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. బయట తిరగలేదని ప్రచారం జరుగుతోంది.
గన్నవరం పరిధిలోని తేలప్రోలులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ కారుపై వైకాపా అభ్యర్థి వంశీతో సహా ఆ పార్టీ శ్రేణుల దాడులకు బరితెగించారు.
తెదేపా శ్రేణులపైకి దూసుకొస్తున్న గన్నవరం వైకాపా అభ్యర్థి వంశీమోహన్
తేలప్రోలులో యార్లగడ్డ కారుపై రాళ్లు రువ్వుతున్న ఉపసర్పంచి ఆదినారాయణరెడ్డి
ధ్వంసమైన వెంకట్రావు కారు అద్దాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?