చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు.
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
స్టేషన్లో తిరగని ఫ్యాన్లు
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. అలాంటి స్టేషన్లో డబ్లింగ్ పనులు చేసే క్రమంలో వివిధ వసతులు కల్పించడంతో అభివృద్ధి చెందుతుందని అందరూ సంతోషించారు. అనతి కాలంలోనే పాడైపోవడంతో ఇక్కడకు వచ్చేవారికి ఇక్కట్లు తప్పడం లేదు.
అన్ని రైళ్లూ ఆగేదెప్పుడో?: మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రయాణికులు వివిధ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్, బీదర్, తిరుపతి, ధర్మవరం, విశాఖపట్నం, కర్నూలు ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు పెడన, గుడివాడల మీదుగా విజయవాడకు మరో 8 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. చిలకలపూడి స్టేషన్లో కేవలం ప్యాసింజర్ రైళ్లను మాత్రమే ఆపుతున్నారు. కొవిడ్కు ముందువరకు ఇక్కడ అన్ని రైళ్లూ ఇక్కడ ఆగేవి. రోల్డ్గోల్డ్ పరిశ్రమలకు నిలయమైన చిలకలపూడి నుంచే రోల్డుగోల్డు నగలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అందుకోసమే ఇక్కడ అన్ని రైళ్లూ ఆగేలా చర్యలు తీసుకున్నారు. చిలకలపూడి పరిసర ప్రాంతాలతోపాటు బందరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వేలాది మందికి ఈ స్టేషన్ చేరువలో అన్ని రైళ్లూ ఆపాలని రోల్డ్గోల్డ్ పరిశ్రమల నిర్వాహకులతోపాటు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రైల్వే ఉన్నతాధిÅకారులకు కూడా వినతిపత్రాలు అందించినా ఎలాంటి చర్యలు లేవు. దీంతో అందరూ దూరమైనా ప్రధాన స్టేషన్కు వెళ్లాల్సి వస్తుంది. అందుబాటులో స్టేషన్ ఉన్నా రూ.వంద వెచ్చించి ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రధానస్టేషన్కు వెళ్తున్నామని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. గతంలో అన్ని రైళ్లూ ఆగడంతో ఆటోకార్మికులు ఉపాధిపొందేవారు. ప్రస్తుతం వారు కూడా అవస్థలు పడాల్సి వచ్చింది.
వచ్చే మార్గంలో పిచ్చిమొక్కలు
ఇదీ పరిస్థితి
- ప్లాట్ఫాం వెంబడి రెండు చోట్ల తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్నాళ్లు సక్రమంగా పనిచేసినా తరువాత పాడైపోయాయి. ఇటీవల ట్యాపులు అమర్చినా కానీ సక్రమంగా నీళ్లు రావడం లేదు. ః తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు పాడైపోయాయి. దీంతో మహిళలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
- ప్లాట్ఫాంపై ఏర్పాటు చేసిన ఫ్యాన్లు తిరగడం లేదు. ఉక్కపోతతో ప్రయాణికుల ఇబ్బందిపడుతున్నారు.
- స్టేషన్ ముఖద్వారం నుంచి ఆవరణలోకి వచ్చే మార్గంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. రెండో నంబరు ప్లాట్ఫాం వద్దకు వెళ్లడానికి వంతెన నిర్మించపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
చిలకలపూడి రైల్వేస్టేషన్లో అన్ని రైళ్లూ ఆగేలా చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అయినా ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు. నగరంలోని రోల్డ్గోల్డ్ పరిశ్రమల నిర్వాహకులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగలు కొనుగోలు చేసి వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఈ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తారు. దీనిపై రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
ఆలపాటి రమేష్, మచిలీపట్నం రోల్డ్గోల్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు
వసతులు కల్పిస్తే మేలు
స్టేషన్లో అన్ని వసతులు లేకపోవడం, కొన్ని రైళ్లే ఆగడంతో ఈ రైల్వేస్టేషన్ అలంకారంగా మారిపోయింది. క్రమేపీ ఇక్కడకు వచ్చే ప్రయాణికులు కూడా తగ్గిపోతున్నారు. స్టేషన్ వద్ద ప్రత్యేకంగా స్టాండ్ ఏర్పాటు చేసుకుని వందల మంది ఆటో కార్మికులు ఉపాధి పొందేవారు. వారంతా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. సంఘ పరంగా అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
బూర సుబ్రహ్మణ్యం, సీఐటీయూ నాయకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?