ఈసారీ అదే తంతు..?
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు.
సగమే వచ్చిన పాఠ్యపుస్తకాలు
న్యూస్టుడే, మచిలీపట్నం కార్పొరేషన్
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. అయితే ప్రస్తుతం కొన్ని తరగతుల పుస్తకాలు మాత్రమే రావడం, పదోతరగతికి సిలబస్ ప్రవేశపెట్టడంతో సకాలంలో పుస్తకాలు అందుతాయా లేదోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు అందజేసిన ఇండెంట్ ప్రకారం పుస్తకాలు మండలకేంద్రాలకు చేర్చే ప్రక్రియ ప్రారంభించారు.1-7 తరగతులకు సంబంధించిన పుస్తకాలు విద్యాశాఖ ద్వారా ఎమ్మార్సీ కేంద్రాలు చేరవేస్తుండగా 8, 9, 10 తరగతులకు సంబంధించిన వాటిని మాత్రం ప్రింటింగ్ప్రెస్ నుంచి నేరుగా మండల కేంద్రాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 1-7 తరగతుల పుస్తకాలు 2.36లక్షలు పంపిణీకి సిద్ధం చేశారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం బందరు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాలకు పుస్తకాలు చేరినా అవి కేవలం 9వ తరగతివి మాత్రమే వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇంతవరకు అన్ని పుస్తకాలు ఎమ్మార్సీ కేంద్రాలకు తరలించలేదు. అక్కడకు చేరితేనే పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేస్తారు. ఎమ్మార్సీ కేంద్రాలకు వచ్చిన వెంటనే పాఠశాలలకు పంపించాలని ఉన్నతాధికారులు ఎమ్యీవోలకు ఆదేశాలు జారీ చేసినా పుస్తకాలు పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత పంపిణీ చేద్దామన్న ఆలోచనలో వారు ఉన్నారు. దీంతో పుస్తకాల పంపిణీ ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితినెలకొంది. దీంతోపాటు 5.99 లక్షల రాతపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా అది కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు.దీంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల్లో కూడా అందోళన నెలకొంది.
విడతల వారీగా..
గూడూరు ఎమ్మార్సీ కేంద్రంలో పాఠ్య పుస్తకాలు
బడితెరిచే నాటికి కొన్ని పుస్తకాలు ఇచ్చి, మిగిలినవి విడతల వారీగా ఇస్తూ వస్తున్నారు. ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రధానంగా పుస్తకాల పంపిణీలో జాప్యం విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠ్యపుస్తకాల పంపిణీ వేగవంతం చేసి బడితెరిచేనాటికి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బడితెరిచే నాటికి అందించకపోతే ఇబ్బందుల్చే
ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీలో జరుగుతున్న జాప్యం విద్యార్థులకు అందించే బోధనపై ప్రభావం చూపుతోంది. ఈసారి కూడా అదే పునరావృతం కాకుండా జూన్ 12వ తేదీ నాటికి పాఠశాలలకు పుస్తకాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యాసంవత్సరంలో పదోతరగతి పాఠ్యపుస్తకాల్లోని సిలబస్లో మార్పులు, చేర్పులు జరిగాయి. కొత్త పుస్తకాలు అందిస్తే తప్ప వార్షిక ప్రణాళిక తయారు చేసుకుని ఉపాధ్యాయులు బోధన ప్రారంభించడానికి అవకాశం ఉండదు. గత కొన్నేళ్లుగా సకాలంలో అన్ని పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు ఇవ్వకుండా నిర్దేశించిన సమయానికి సిలబస్ పూర్తిచేయాలంటూ ఒత్తిడి పెడుతున్నారంటూ పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
చర్యలు తీసుకున్నాం
బడితెరిచే నాటికి అన్ని పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి మండలంలో పుస్తక నిల్వకేంద్రం ఏర్పాటు చేసి వచ్చిన పుస్తకాలు వచ్చినట్లు అక్కడ భద్రపరుస్తున్నాం. పుస్తక పంపిణీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించేలా ఎంఈవో-2లను ఇన్ఛార్జులుగా నియమించాం. ఇప్పటికే రాత పుస్తకాలు మండలకేంద్రాలకు చేరాయి. కొన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు కూడా వచ్చాయి. మిగిలిన పాఠ్యపుస్తకాలు కూడా త్వరలోనే కేంద్రాలకు చేరతాయి.
తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్