విజ్ఞానం.. వినోదం
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది.
వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకుంటున్న బాలబాలికలు
తిరువూరు, న్యూస్టుడే
శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులు
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యం వెలికి తీసేందుకు చిత్రలేఖనం, చదరంగం, మెదడుకు పదును పెట్టేలా క్విజ్, వ్యాసరచన, బిడియం పోగొట్టేందుకు వక్తృత్వం వంటి పోటీలు, ఆటవిడుపుగా ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఇంద్రజాలికుడు పాపారావు తన ఇంద్రజాల ప్రదర్శన ద్వారా విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. విద్యారంగ నిపుణులు తెలుగు, ఆంగ్లభాష, లెక్కల సబ్జెక్టుపై పట్టు సాధించడం కోసం మెలకువలు నేర్పిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభను చాటి చెప్పేందుకు శిబిరాలను వేదికగా మలచుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్న శిబిరాలకు హాజరవుతూ విజ్ఞానం పెంపొందించుకోవడంతోపాటు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
కొత్త విషయాలు నేర్చుకున్నా
వేసవి శిక్షణ శిబిరంలో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఆంగ్లం, తెలుగు గ్రామర్లో మెలకువలు నేర్చుకున్నాను. లెక్కలు చేయడం కష్టం కాదని తెలుసుకున్నాను. స్నేహితులతో కలిసి ఆటపాటలతో గడుపుతుంటే సమయం తెలియడం లేదు. విజ్ఞానం పెంపొందించుకునేందుకు శిబిరాలు దోహదపడతాయని తెలిసింది.
డి.దీక్షిత, 8వ తరగతి
పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది
పుస్తక పఠనంలో భాగంగా కథలు, ప్రముఖుల జీవిత చరిత్ర వంటి పుస్తకాలు చదివిస్తున్నారు. పాఠశాలలో కేవలం పాఠ్యపుస్తకాలతోనే కుస్తీ పట్టే నాలాంటి వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగింది. కథల ద్వారా నీతిని, ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం వల్ల వారి లక్ష్యం అర్థమైంది.
ఎస్కే సమీనా, 9వ తరగతి
ఉత్సాహంగా హాజరవుతున్నాం
వేసవి శిక్షణ శిబిరంలో ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్పుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా క్రమం తప్పకుండా వస్తున్నాం. వీటికి తోడు పలు రకాల పోటీలు నిర్వహిస్తుండటంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మధ్య మధ్యలో ఆటవిడుపుగా జోక్స్ చెప్పడం, ఇంద్రజాల ప్రదర్శనల వల్ల బోర్ కొట్టడం లేదు.
తేజ ఉమాయశస్విని, 9వ తరగతి
నిపుణుల సలహాలు ఎంతో ఉపయోగం
రోజుకో అంశంపై చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. క్విజ్ పోటీలతో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. శిబిరానికి హాజరవుతున్న వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. మేము అడిగిన ప్రశ్నలకు విద్యారంగ నిపుణులు తమ సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు అనుమానాలను నివృత్తి చేస్తున్నారు.
నవ్యతేజశ్రీ, 6వ తరగతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?