పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు.
సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో వల
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. నిజమే అని నమ్మిన ఆ యువకుడు సరే అనడంతో వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో కలిపి.. అందులో పలు పథకాలకు సంబంధించిన ప్రకటనలను పోస్ట్ చేశాడా మోసగాడు. ఆ వ్యక్తి సూచించిన బ్యాంకు ఖాతాల్లో దశలవారీగా రూ. 4 లక్షలు జమ చేశాడు ప్రసాదంపాడు యువకుడు. చెప్పిన గడువు దాటిపోయినా.. ఎంతకూ రాబడులు తన ఖాతాలో జమ కాకపోవటం... ఇంకా వివిధ పేర్లతో డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుండడంతో మోసపోయానని గుర్తించాడు.
కొద్దిపాటి డబ్బుతోనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఊహించని లాభాలు ఆర్జించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ ప్రకటనకు ఆకర్షితురాలయ్యారు నగరానికి చెందిన ఓ మహిళ. వెంటనే అందులో ఇచ్చిన ఫోన్ నెంబరుకు కాల్ చేసి మాట్లాడారు. తొలుత రూ. వెయ్యి పెట్టుబడి పెట్టమని చెప్పాడు అవతలి వ్యక్తి. దీనిపై రూ. 1,300 లాభం వస్తుందని నమ్మించాడు. అనుకున్నట్టే అంత మొత్తం రావటంతో ఆమె నమ్మి దశలవారీగా రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అంతే ఆ మోసగాడు స్పందించడం మానేశాడు.
ఈనాడు, అమరావతి: బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నాలుగురెట్ల రాబడి పొందవచ్చు.. స్టాక్ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రకటనలతో సైబర్ మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రముఖుల బోగస్ ఇంటర్వ్యూలు, ఏఐ ఆధారిత వీడియోలను వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జించవచ్చని నమ్మబలుకుతున్నారు. నిజమే అని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారికి తొలుత కొంత మొత్తం ఇచ్చి లాభాలుగా చూపించి నమ్మకం కలిగిస్తున్నారు. చివరకు పెద్దమొత్తాలను జమ చేయించుకుని పత్తా లేకుండా పోతున్నారు.
క్రిప్టో కరెన్సీ రూపంలో తరలుతోంది
అమాయకుల ఖాతాల్లో జమవుతున్న నగదును సైబర్ మోసగాళ్లు పలు బినామీ ఖాతాలకు మళ్లిస్తున్నారు. వీటి నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో మన దేశం దాటించేస్తున్నారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా ఉంది. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం ఒకపట్టాన సాధ్యంకాని పరిస్థితి.
అమాయకుల ఖాతాలతో లావాదేవీలు...
తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డ మోసగాళ్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. డబ్బు, కమీషన్ ఆశ చూపించి వారి బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలను తీసుకుని వీటితో వ్యవహారాలను నడిపిస్తున్నారు. అసలు ఖాతాలే లేనివారిని కూడా ఒప్పించి మరీ అకౌంట్లు తెరిపిస్తున్నారు. వీటికి సంబంధించి పాస్బుక్, అంతర్జాల, మొబైల్ బ్యాంకింగ్ ఐడీలు, పాస్వర్డ్లను తమవద్దనే ఉంచుకుని అంతా నడిపిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ. చివరకు అమాయకులే దొరికిపోతున్నారు. వీరెవరికీ తమ ఖాతాల ద్వారా రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలియదు.
ప్రకటనలు చూసి బోల్తా పడొద్దు
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దు.
- మీ వాట్సాప్, టెలిగ్రాం యాప్లకు వచ్చే మెసేజ్లను నమ్మొద్దు
- పెట్టుబడుల పేరుతో అనేక సైట్లు, అప్లికేషన్లు వచ్చాయి. వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ముందుకెళ్లాలి.
- మీ పెట్టుబడికి అనేక రెట్లు ఎక్కువ సొమ్ము వస్తుందని ఊరిస్తారు. వీటి వలలో చిక్కుకోవద్దు.
- ఒకవేళ ఏదైనా గ్రూప్లోకి మీ ఆమోదం లేకుండా కలిపితే.. రిపోర్ట్ చేసి, బయటకు వచ్చేయడం మంచిది. అనుమతి లేకుండా అవాంఛిత గ్రూప్లలో కలిపేందుకు అవకాశం లేకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్లో మార్చులు చేసుకోవచ్చు.
- ఆర్బీఐ ఆమోదించిన ఆర్థిక సంస్థల్లోనే పెట్టుబడులు సురక్షితం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం