సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు.
ట్రాక్ల ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?
రెండేళ్ల కిందటే నగరపాలక సంస్థ ప్రతిపాదనలు
ఈనాడు, అమరావతి
ఎంతో అనుకూలం
సైక్లింగ్కు విజయవాడ, మచిలీపట్నం అత్యంత అనువైన నగరాలు. రహదారులు ఎత్తుపల్లాల్లేకుండా సాఫీగా ఉండడమే దీనికి కారణం.
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. విజయవాడలో సైక్లింగ్కు ప్రత్యేక ట్రాక్లు ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా నగరవాసులు కోరుతూనే ఉన్నారు. 2010లో అప్పటి మున్సిపల్ కమిషనర్ రవిబాబు ప్రత్యేక చొరవ తీసుకుని బందరు, ఏలూరు రోడ్లు, బీఆర్టీఎస్లో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయించారు. తర్వాత వచ్చిన అధికారులు ట్రాక్ల నిర్వహణను పట్టించుకోకపోవటంతో అవి కనుమరుగైపోయాయి. ప్రస్తుత కమిషనర్ స్వప్నిల్ దినకర్ 2022 ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించాక సైకిల్ ట్రాక్ల ఏర్పాటు కోసం ప్రయత్నించారు. ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలో అధికారుల నుంచి అభిప్రాయాలను సైతం సేకరించారు. కానీ.. ఇవేమీ ముందుకు కదల్లేదు.
ఐదు లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలపై డెమోగ్రాఫియా సంస్థ(అమెరికా) అధ్యయనం చేసి 2016లో నివేదించిన మేరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో తొలిగా ఢాకా, హైదరాబాద్ ఉన్నాయి. మూడో స్థానం విజయవాడదే.. 2016లోనే చదరపు కిలోమీటరుకు 31,200 మంది నివసిస్తున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇంత రద్దీగా ఉన్న నగరంలో ప్రజల శారీరక వ్యాయామానికి సరైన సౌకర్యాలు లేవు. అందుకే నగరవాసులను గుండె సంబంధ సమస్యలు, ఊబకాయం సహా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. సైక్లింగ్ను ప్రోత్సహిస్తే శారీరక, మానసిక వ్యాయామానికి దోహదపడుతుంది. రెండు నగరాల్లోనూ ఎటు నుంచి ఎటు వెళ్లినా పది కిలోమీటర్లలోపే ఉండడంతో సైకిల్ అనువైన వాహనం. దీన్ని వినియోగించాలని వేలాదిమందికి ఆసక్తి ఉన్నా.. రద్దీ రోడ్లపై సాధ్యం కావటం లేదు. భారీగా పెరిగిన ట్రాఫిక్ మధ్యలోంచి సైక్లింగ్ చేస్తున్నవారు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రత్యేకంగా రహదారులపై సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంధన ఖర్చు ఆదా..
సైకిళ్ల వినియోగం పెరిగితే.. ఆరోగ్యంతో పాటు.. ఇంధన వ్యయాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 109.31, డీజిల్ ధర రూ. 97.17. నగరపాలక సంస్థలు సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయగలిగితే ఇంధనంపై నెలకు కనీసం రూ. వెయ్యి ఆదా చేయొచ్చు. పైగా అనారోగ్యాల కారణంగా ఆసుపత్రులకయ్యే వ్యయాన్నీ తగ్గించుకోవచ్చు.
వాహన రద్దీని తగ్గించొచ్చు..
రెండు నగరాల్లో వాహన కాలుష్యం గత పదేళ్లలో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 15 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 40 వేలకుపైగా ఆటోలు, వేల సంఖ్యలో కార్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు రహదారులపై తిరుగుతున్నాయి. విజయవాడలోని బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, రామవరప్పాడు, ఆటోనగర్, వన్టౌన్, ఏలూరు రోడ్డులోని అనేక కూడళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకూ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది.
వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధుల బాధితుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. అందుకే సైక్లింగ్ను ప్రోత్సహిస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నాటి ప్రభుత్వం సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. వైకాపా వచ్చాక వాటిని బుట్టదాఖలు చేసింది.
నగరంలో పీఎం 10 (సూక్ష్మ ధూళి కణాలు) ఘనపు మీటరులో 114 మైక్రోగ్రాములు, పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళి కణాలు) ఘనపు మీటరులో 65 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు గతంలో ఓ నివేదిక తేల్చి చెప్పింది. ఇందులో వాహనాల ద్వారా వెలువడుతున్న ధూళి కణాలు.. పీఎం 10 సూక్ష్మధూళి కణాలు 33 మైక్రోగ్రాములు, పీఎం 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు 37 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు తేలింది.
చాలామంది ఆసక్తి..
ఇప్పటికే విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో లక్షల సంఖ్యలో సైకిళ్లు ఉన్నాయి. గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. బందరు రోడ్డులో పదేళ్ల కిందట సైకిల్ ట్రాక్ వేసినప్పుడు చాలామంది ఆసక్తిగా ముందుకొచ్చారు. తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోలేదు. ఇప్పటికీ సైకిళ్లపై తిరుగుతున్నవారు వందలాదిమంది ఉన్నారు. వీరిని ప్రమాదాలు చుట్టుముడుతున్నాయి. విద్యార్థుల్లో చాలామంది సైకిళ్లను వినియోగిస్తున్నారు. ట్రాక్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ