నైపుణ్యనారీ.. విజయాల భేరి
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు.
స్వయంగా రాణించేలా తర్ఫీదు
కేబీఎన్ కళాశాలలో మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ
ఈనాడు డిజిటల్, అమరావతి
మగ్గం వర్క్ నేర్చుకుంటూ..
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంట్లో పనులు చక్కదిద్దుకుని.. తీరిక వేళల్లో స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆలోచనలకు పదునుపెడుతూ.. ఎక్కువ పనిభారం లేకుండా జ్ఞానం పెంపొందించుకుంటూ.. కుటుంబానికి చేదోడు అందిస్తున్నారు. ఇటువంటి ఔత్సాహిక మహిళలకు విజయవాడలోని కేబీఎన్ కళాశాలలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా విభాగం ఉచితంగా వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి.. వారిని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తోంది.
ఆదాయ మార్గాలు చూపిస్తూ..
విజయవాడలోని కేబీఎన్ కళాశాల 2006లో ప్రత్యేకంగా ‘మహిళా సాధికారిత విభాగాన్ని’ ప్రారంభించింది. కళాశాల విద్యార్థినులే కాక చుట్టుపక్కల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై వివిధ విభాగ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందించి సులభతరంగా ఆదాయ మార్గాలు చూపిస్తున్నారు. 2015లో యూనియన్ గ్రాంట్స్ కమిషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ పనితీరును గుర్తించి..ఉమెన్ స్టడీ సెంటర్గా మార్పు చేసింది. కంప్యూటర్ అప్లికేషన్స్, గ్రాఫిక్స్, డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ స్టైలింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, గ్లాస్ శాండ్ పాట్ పెయింటింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, జూవెలరీ మేకింగ్, మెహందీ డిజైన్, ఆన్లైన్ పర్చేజింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
బ్యూటీపార్లర్ శిక్షణ పొందుతున్న మహిళలు
రూ.100 కడితే చాలు..
రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇస్తుండడంతో ఎక్కువ మంది చేరుతున్నారు. ఏడాది పొడువునా టైలరింగ్, స్కూటీ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తారు. ట్రాఫిక్ నిబంధనలను వివరించడం, డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు అవగాహన కల్పిస్తున్నారు. నిర్వాహకులు, టైలరింగ్ పూర్తి చేసిన వారు ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. రూ.100 దరఖాస్తు రుసుము మినహా శిక్షణ కాలంలో ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
గ్లాస్ శాండ్ పాట్..
వ్యాపారంగా మలుచుకుంటూ..
విద్యార్థునులతో పాటు.. గృహిణులు ఇంట్లో తమ బాధ్యతలు నిర్వర్తిస్తునే.. ఇంట్లో పిల్లలతో పాటు ఇతరులకు కావాల్సిన దుస్తులు కుట్టి ఈ పనినే వ్యాపారంగా మలుచుకుంటున్నారు. వస్త్రాలంకరణతో పాటు అతివల అలంకరణలో నూతన డిజైన్లు, ఫ్యాషన్లకు అనువైన రీతిలో తర్ఫీదు ఇస్తున్నారు. దుస్తులు, జూవెలరీ, డిజైనింగ్స్, పెయింటింగ్స్లో శిక్షణ తీసుకున్నవాళ్లంతా.. వాట్సప్ గ్రూపులు, ఆన్లైన్ ద్వారా ప్రచారం చేస్తూ వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకున్న వారంతా వివాహాది శుభకార్యాలకు మహిళలను ముస్తాబు చేసేందుకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి మేకప్ వేస్తూ నెలకు పదివేల నుంచి 25 వేల రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు.
మెహందీ వేస్తూ..
మహిళా సాధికారితకు కృషి
ఉమెన్ స్టడీ సెంటర్ కేవలం శిక్షణ ఇచ్చి వదిలేయకుండా తర్ఫీదు అనంతరం ధ్రువపత్రాలు అందిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందిపుచ్చుకునేందుకు ఈ ధ్రువపత్రాలు ఉపయోగపడతాయి. ఇప్పటిదాక 30 వేల మంది మహిళలు శిక్షణ పొందారు. వారంతా స్వశక్తితో వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. ఈ శిక్షణలకు లభిస్తున్న ఆదరణతో మరిన్ని కొత్త కోర్సులను ప్రారంభించి మహిళలకు ఆర్థిక భద్రత, సాధికారిత దిశగా వారిని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తాం.
వి.శైలజ, ఉమెన్ స్టడీ సెంటర్ విభాగాధిపతి, కేబీఎన్ కళాశాల
స్వయంగా సంపాదిస్తున్నాను
నేను మగ్గం వర్క్ 25 రోజులుగా నేర్చుకుంటున్నాను. ఇదే వర్క్ బయట నేర్చుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాలి. ఉమెన్ స్టడీ సెంటర్లో కేవలం రూ.100 ప్రవేశ రుసుముతోనే సులభంగా నేర్చుకునే అవకాశం కల్పించారు. ఇంట్లో కూడా మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేస్తూ.. చిన్న దుకాణం పెట్టాను. స్వయంగా నాలుగు రోజుల్లో ఒక బ్లౌజ్కి మగ్గం వర్క్ చేస్తూ.. డబ్బు సంపాదిస్తున్నాను.
గృహలక్ష్మి, విజయవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్