logo

ఓపెన్‌ చదరంగం విజేత మహేష్‌కుమార్‌

తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్‌కిడ్స్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్‌ ర్యాపిడ్‌ చదరంగం టోర్నమెంట్‌ ఆదివారం జరిగింది.

Published : 20 May 2024 03:32 IST

చదరంగం పోటీల్లో క్రీడాకారులు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్‌కిడ్స్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్‌ ర్యాపిడ్‌ చదరంగం టోర్నమెంట్‌ ఆదివారం జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరవ్వగా వీరికి 7 రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి యేలేజి విజయ మాట్లాడుతూ మేథోశక్తి, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. విజేతలుగా కె.మహేష్‌కుమార్‌(రాజమహేంద్రవరం), స్వర్ణనిహాల్‌(తిరుపతి), తాళ్ల నిశ్చల్‌(కృష్ణా జిల్లా) నిలిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ యేలేటి రవిబాబు, సీఈఓ యేలేటి రుద్రశ్రీ మహస్వి, జిల్లా చదరంగం సంఘ కార్యదర్శి జీవీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని