logo

ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి

గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ  రమేష్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు.

Published : 20 May 2024 03:32 IST

పరామర్శిస్తున్న తెదేపా నాయకులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ  రమేష్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయనను డిశ్చార్జి చేసిన వైద్యులు.. మందులు వాడాలని సూచించారు. కాగా, ఆయన్ను నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మురారి వాసు, అమరావతి టీచర్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొనకళ్ల రెడ్డమ్మ, కొలుసు పార్థసారథి తదితరులు పరామర్శించారు.

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన కొనకళ్ల నారాయణరావును తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పూలదండలతో సత్కరించారు. మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నాయకులు కొనకళ్ల ఇంటికి చేరుకుని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని