సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం
కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది.
చేపల చెరువులకు మళ్లించినట్లుగా అనుమానం
కృత్తివెన్ను మండలంలో దాహం కేకలు
అడుగంటుతున్న నీటి నిల్వలు
పెడన, న్యూస్టుడే: కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. గత నెలలో ఈ చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపగా కొద్ది రోజుల్లోనే నిల్వలు నేలమట్టానికి చేరుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెరువు నుంచి సమీపంలో ఉన్న చేపల చెరువులకు ఈ నీటిని మళ్లించినట్లు మండల ప్రజలు అనుమానిస్తున్నారు.
కృత్తివెన్ను మండలంలో 16 పంచాయతీలు, 50 వేల జనాభా ఉండగా చినపాండ్రాక, ఇంతేరు పంచాయతీలు మినహా మిగిలిన 14 పంచాయతీల పరిధిలోని 40 గ్రామాలకు సీతనపల్లి సామూహిక నీటి పథకం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. దాదాపు 14 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువును ఒక్కసారి పూర్తిగా నింపితే రెండు నెలల వరకు తాగునీటి అవసరాలు తీరుతాయి. గత నెలలో కాలువలకు అత్యవసరంగా నీటిని విడుదల చేయగా చెరువును పూర్తి స్థాయిలో నింపారు. జూన్ రెండో వారంలో కాలువలకు నీటిని విడుదల చేసేంత వరకు చెరువులోని నీటి నిల్వలతో మండల ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. ఒక్కసారిగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో మండలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చెరువులోని నీటిని సమీపంలోని చేపల చెరువులకు మళ్లించారని ఇందులో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పాత్ర ఉందని జడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆందోళన వెలిబుచ్చి ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
సంప్ నుంచి నీరు తీసుకెళ్తున్న గ్రామస్థులు
తాగునీటి ఎద్దడి : ప్రస్తుతం మండలంలోని ఉప్పులూరు, చెరుకుమిల్లి, ఏటిపవరు, చినగొల్లపాలెం, వాల్లంక, పీతలావ, కృత్తివెన్ను, పడతడిక, ఒర్లగొందితిప్ప తదితర గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఒర్లగొందితిప్ప, పడతడిక గ్రామాల్లో కనీసం మంచినీటి చెరువులు కూడా లేకపోవడంతో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏటిపవరు గ్రామానికి వారానికి ఒకరోజు కూడా సరఫరా జరగడం లేదు. 1500 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. దీనిపై ఆర్డబ్లూఎస్ ఏఈ నాగేశ్వరరావు వివరణనిస్తూ..నీటి చౌర్యం జరగలేదని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే