స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా
విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ
ఈనాడు - అమరావతి
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామ’ని విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ చెప్పారు. నగరంలోని కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువగా ఘర్షణలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పారదర్శక, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలి. శాంతి, భద్రతలపరంగా సమస్యలు సృష్టించిన 109 మందిని గుర్తించామనీ, త్వరలో వారిని బైండోవర్ చేస్తామని వివరించారు. పది మందిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. ఏడుగురిని నగర బహిష్కరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని’ వివరించారు.
స్ట్రాంగ్రూమ్లు అనుసంధానిస్తూ కంట్రోల్ రూమ్.. ఈవీఎంలు భద్రపర్చిన నిమ్రా, నోవా కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశాం. వాటికి మూడంచెల భద్రత కల్పించాం. స్ట్రాంగ్ రూంల పరిసర ప్రాంతాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాం. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉన్న వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు, ఏజెంట్లకు మాత్రమే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు అనుమతి ఉంది. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేముందు, తిరిగి వచ్చేముందు వివరాలను లాగ్ బుక్లో రాయాలి. 29 స్ట్రాంగ్ రూంలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సీనియర్ పోలీస్ అధికారులు వీటిని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. ఎన్నికలు ముగిసిన అనంతరం జరిగిన సంఘటలను దృష్టిలో పెట్టుకొని అన్ని డివిజన్లలో పికెట్లు ఏర్పాటు చేశాం. సెక్షన్ 144తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండడంతో కమిషనరేట్ పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టరాదు. వదంతులు నమ్మి ఎవరూ గొడవలకు పాల్పడవద్దు. ఏవైనా అనుమానాలుంటే పోలీసులను సంప్రదించి రూఢి చేసుకోవాలి.
సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా
సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు. పెట్రోల్ బంకుల్లో డబ్బాలు, క్యాన్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం ఉంది. బాణసంచా అమ్మడం, కాల్చడం ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టేనని వాటి తయారీ, విక్రయదారులకు నోటీసులు జారీ చేశాం. సామజిక మాధ్యమాల్లో ఎవరైనా విష ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా పర్యవేక్షణపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ బృందాన్ని మరింత విస్తరించాం. కీలకమైన ప్రాంతాల్లో స్టేషన్ల వారీగా కూడా ఏర్పాటు చేయాలని తలపోస్తున్నాం. తద్వారా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పక్కా నిఘా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామ’ని సీపీ రామకృష్ణ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం