ఓట్ల లెక్కింపుపై అవగాహన
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు.
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే: ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో పోలైన పోస్టల్ బ్యాలట్ సంఖ్యను బట్టి 500 ఓట్లకు ఓ టేబుల్ ఏర్పాటు చేయాలని, అలాగే లెక్కింపు వేగవంతం అవుతుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తిరస్కరించిన, చెల్లని ఓట్లకు సంబంధించి కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయండి
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సమయం సమీపిస్తున్నందున అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో సాగు భూములు, విస్తీర్ణం, నేలల స్వభావం, సాగు చేసే పంటలు తదితర అంశాలను జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి వివరించగా, రైతులు సాగు చేసే విత్తన రకాలు, నేలల స్వభావాన్ని బట్టి వచ్చే దిగుబడులపై మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.ఎం.గిరిజారాణి కలెక్టర్కు వివరించారు. ఉద్యాన పంటల వివరాలను జిల్లా ఉద్యాన శాఖాధికారి జ్యోతి తెలిపారు. వారితో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందితో రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని, ఆయా శాఖల వారీగా ప్రగతి సూచికల్లో ఉత్తమ స్థానం ఉండేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మత్స్య శాఖాధికారి శివసామ్రాజ్యం, సూక్ష్మసేద్య అధికారి జి.విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ విభాగాధికారి పార్థసారథిÅ, మార్క్ఫెడ్ డీఎం మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం