logo

రోడ్డు ప్రమాదంలో నాగాయలంక వాసి మృతి

నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్‌లోని రామవరప్పాడు రింగురోడ్డు వద్ద ప్రమాదంలో మృతి చెందాడు.

Published : 21 May 2024 11:22 IST

విజయవాడ: నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్‌లోని రామవరప్పాడు రింగురోడ్డు వద్ద ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తన కుమారుడిని ప్రతీ రోజు క్రికెట్ కోచింగ్ నిమిత్తం తీసుకు వెళ్తున్నాడు. మంగళవారం ఉదయం కోచింగ్‌కు ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తున్న క్రమంలో లారీ ఢీకొనడంతో మురళి లారీ చక్రం కింద పడిపోగా, కుమారుడు పక్కకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని