logo

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు

నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్‌ గౌరవ్‌’ రైలును నడపనున్నారు. జూన్‌ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది.

Updated : 22 May 2024 07:49 IST

విజయవాడ(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్‌ గౌరవ్‌’ రైలును నడపనున్నారు. జూన్‌ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదగా నైమిశారణ్యం,  ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. టీ, టిఫిన్, భోజనం, హోటల్‌ గదులు, రవాణాతో కలిపి టికెట్‌ ఒక్కొక్కరికీ సెకెండ్‌ ఏసీలో రూ.59,950, థర్డ్‌ ఏసీలో రూ.54,900, స్లీపర్‌ తరగతిలో రూ.45,900 ఉంటుంది. టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాలకు 93550 21516 నంబరులో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని