logo

దివ్యాంగురాలిపై అఘాయిత్యం

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే రీతిలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. దివ్యాంగురాలిపై రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ గర్భవతిని చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 22 May 2024 03:15 IST

గర్భవతిని చేసిన ముగ్గురు వ్యక్తులు
కంకిపాడు మండలం దావులూరులో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే రీతిలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. దివ్యాంగురాలిపై రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ గర్భవతిని చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కంకిపాడు ఎస్‌ఐ సందీప్‌ కథనం ప్రకారం.. గ్రామంలో ఓ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె(26) ఉన్నారు. కుమార్తె పుట్టుకతోనే దివ్యాంగురాలు కాగా.. ఆమె సరిగా మాట్లాడలేదు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొన్ని రోజులుగా ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె కడుపునొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా.. గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులైన ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ ముగ్గురూ వివాహితులు కావడం గమనార్హం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని