పాడి రైతు అభ్యున్నతే లక్ష్యం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించిన విజయ డెయిరీ.. పాల సేకరణలో అగ్రగామిగా నిలుస్తూ, పాడి రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది.
విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే : ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించిన విజయ డెయిరీ.. పాల సేకరణలో అగ్రగామిగా నిలుస్తూ, పాడి రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ప్రతికూల పరిస్థితోల్లోనూ పశుపోషకులకు అత్యధిక ధర చెల్లించడంతో పాటు, అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో అనతికాలంలోనే నూతన యూనిట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చలసాని ఆంజనేయులు ఈ సంస్థ ఛైర్మన్గా పగ్గాలు చేపట్టి నేటితో అయిదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వివరాలు వెల్లడించారు.
మరింత నమ్మకం కల్పించాం : కొవిడ్ మహమ్మారి రావడంతో డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయినా కూడా తట్టుకుని రైతులకు అత్యధిక ధర, బోనస్ చెల్లించాం. రాష్ట్ర ప్రభుత్వం పోటీగా అమూల్ సంస్థను తెరపైకి తీసుకువచ్చినా.. విజయ డెయిరీపై రైతులకు మరింత నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నాం. పాల సేకరణలో గణనీయమైన వృద్ధి సాధించాం.
అత్యధిక ధర చెల్లింపు : ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా సహకార వ్యవస్థలోనే రైతులకు అత్యధిక ధర చెల్లిస్తున్నాం. లీటరుకు గరిష్ఠంగా రూ.80 ధర, మూడు విడతలుగా బోనస్ చెల్లించి పశు పోషకులకు చేయూతనిచ్చాం. విజయ డెయిరీ ప్రతి రూపాయిలో 82 పైసలు రైతులకే అందిస్తుంది.
సంక్షేమానికి ప్రాధాన్యం : రైతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ప్రమాదవశాత్తూ మరణించినవారికి క్షీరబంధు పథకం పేరుతో రూ.50 వేలు, రైతు కుటుంబాల్లో వివాహం చేసుకునే వారికి రూ.20 వేల విలువైన బంగారు నాణేలు ఇస్తున్నాం. ఇప్పటివరకు 1,600 కుటుంబాలకు క్షీరబంధు, 2,300 జంటలకు బంగారు నాణేలు అందజేశాం. రెండు వేల మందికి ఉచిత వైద్య పరీక్షలు, ఆరు వేల మందికి కంటి పరీక్షలు చేయించాం.
నూతన యూనిట్ ఓ మైలురాయి : ఉత్పత్తి ఖర్చును తగ్గించుకుని, మరింత నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడానికి వీలుగా బాపులపాడు మండలం వీరవల్లిలో ‘ప్రాజెక్ట్ కామధేను’ పేరుతో అధునాతన యూనిట్ని నిర్మించగలిగాం. రోజుకు ఆరు లక్షల లీటర్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేశాం. దేశ చరిత్రలోనే పూర్తి ఆటోమేషన్ యూనిట్గా నిలిచింది. సంస్థకు రూ.200 కోట్ల విలువైన ఆస్తిని సమకూర్చగలిగాం.
రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యం : అయిదేళ్ల కిందట సంస్థ వార్షిక టర్నోవర్ రూ.719 కోట్లుగా ఉంది. దీనిని రూ.1,196 కోట్లకు చేర్చగలిగాం. పాలకవర్గ సభ్యులు, ఉద్యోగుల సమన్వయంతో ఇది సాధ్యమైంది. రానున్న అయిదేళ్లలో రూ.2,500 కోట్లకు చేర్చాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?