గౌరవ భృతి ఏదీ?
జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలు అందించిన బీఎల్వో(బూత్స్థాయి అధికారి)లు గౌరవ భృతి కోసం ఎదురు చూస్తున్నారు.
బీఎల్వోల ఎదురుచూపులు
జిల్లా వ్యాప్తంగా రూ.3.21 కోట్ల బకాయిలు
ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్టుడే
జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలు అందించిన బీఎల్వో(బూత్స్థాయి అధికారి)లు గౌరవ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో 295 మందితోపాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో 1781 మంది బీఎల్వోలుగా విధులు నిర్వహించారు. వీరందరూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే. వీరికి గౌరవ భృతి కింద రూ.3.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. గతంలో అంగన్వాడీ, ఆశా, పురపాలిక ఉద్యోగులు సిబ్బంది ఈ విధులు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత ఎంపిక చేసిన సచివాలయ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు.
విధులు ఇవే: గత 33 నెలలుగా వీరు ఇంటింటి ఓటరు సర్వే, ఆ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితా, సవరణ, ప్రత్యేక శిబిరాలు, అవగాహన ప్రదర్శన, సదస్సుల నిర్వహణ, పోలింగు కేంద్రాలలో వసతుల కల్పన, గుర్తింపు పత్రాలు పంపిణీతోపాటు గ్రామాంతరం వెళ్లిన ఓటర్ల గుర్తింపు, మృతులు, కొత్త ఓటర్ల చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం పోలింగు ప్రక్రియలో కీలక పాత్ర వహించారు. వీరికి గౌరవ భృతి చెల్లించాలన్న ఈసీ ఆదేశాలు నేటి వరకు అమలుకు నోచుకోలేదు.
బడ్జెట్ విడుదలైతేనే.. : ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి బీఎల్వోకు గౌరవ భృతిగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6000 చెల్లించాల్సి ఉంది. గత 33 నెలలుగా విధులు నిర్వహిస్తున్న వీరికి ఇటీవల మూడు నెలకు సంబంధించిన గౌరవ భృతిని రాష్ట్రప్రభుత్వం చెల్లించింది. ఇంకా 30 నెలకు సంబంధించి రూ.3.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. విషయాన్ని సచివాల ఉద్యోగల సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బడ్జెట్ రాగానే అందజేస్తామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదలైన బడ్జెట్ నిధుల నుంచి ప్రభుత్వ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులకు ఇప్పటికే నిబంధనల మేర చెల్లింపులు చేశారు. తమకు మాత్రం ప్రభుత్వం రిక్తహస్తమే చూపుతుందని ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే