లెక్కింపు కేంద్రానికి మూడంచెల భద్రత
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్ట్రాంగ్రూములకు మూడంచెల పటిష్ఠ భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
వైద్య సిబ్బందితో సమీక్ష
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్ట్రాంగ్రూములకు మూడంచెల పటిష్ఠ భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బాలాజీ, పలువురు అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, విద్యుత్తు సరఫరా పరిస్థితిని సీఎస్కు వివరించారు. జూన్ రెండో వారంలో రైతులు సాగు పనులు ప్రారంభిస్తారని, గత అనుభవాల దృష్ట్యా తుపాను పరిస్థితుల్లో పొలాలు ముంపుబారిన పడకుండా కాలువలు, డ్రెయిన్లలో తూడు తొలగించే పనులు చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగ ఈఈ టి.శివప్రసాదు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, మచిలీపట్నం నగరపాలకసంస్థ కమిషనర్ బాపిరాజు, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలయ్యే కార్యక్రమాలపై ప్రతి వారం సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తరువాత క్షేత్ర స్థాయి సిబ్బందితో రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని డీఎంహెచ్వో గీతాబాయిని ఆదేశించారు. సిబ్బంది వారీగా నిర్వహించాల్సిన విధులు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్ల నిర్వహణ, సాధించాల్సిన ప్రగతి వచ్చే నెల 18న సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈలోపు అన్నీ సిద్ధం చేయాలన్నారు. మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్యకళాశాల, సర్వజన ఆసుపత్రితో పాటు గుడివాడలో ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నాయని అన్నారు. వీటితో పాటు 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది, ఖాళీల వివరాలను డీఎంహెచ్వో కలెక్టర్కు వివరించారు. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా.సతీష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం