దయచేసి వినండి మీ రైలు రద్దయింది!
‘‘విజయవాడ డివిజన్లో నిర్వహణ పనులు (ట్రాఫిక్ బ్లాక్) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఏడాదిగా సాగుతున్న నిర్వహణ పనులు
సర్వీసుల తాత్కాలిక నిలిపివేతతో తంటాలు
ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
న్యూస్టుడే, విజయవాడ
‘‘విజయవాడ డివిజన్లో నిర్వహణ పనులు (ట్రాఫిక్ బ్లాక్) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యాధునిక వ్యవస్థ కలిగిన రైల్వే శాఖ ఏడాదిగా నిర్వహణ పనులు చేపట్టడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది.’’
రద్దీ వేళ ఇలాగేనా చేసేది?
విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్ప్రెస్లో ప్రతి రోజూ విజయవాడ నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు... ఏలూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం వరకు వెళుతుంటారు. ఈ రైలును గత కొంత కాలంగా నిర్వహణ పనుల పేరుతో రద్దు చేస్తున్నారు. ఇది ద్వారకాతిరుమల చిన వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేది.
- గుంటూరు, రాయగడ మధ్య నడిచే రైలును కూడా ఇలాగే ఆపేశారు. హౌరా మార్గంలో రైళ్లు ఎప్పుడూ రద్దీగా నడుస్తాయి. రిజర్వేషన్ కూడా సీజన్, అన్ సీజన్తో సంబంధం లేకుండా నాలుగు నెలల ముందే బుక్ చేసుకుంటారు.
- విజయవాడ, బిట్రగుంట మధ్య నడిచే బళ్లదీ ఇదే పరిస్థితి.
- సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి లక్ష మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా వేసవి సెలవుల్లో ఇది రెట్టింపవుతుంది. ఈ సమయంలో సర్వీసులు ఆపేయడం ఎంత వరకు సబబని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
బ్రాంచి లైన్లో నరకయాతన.. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం బ్రాంచి లైన్లోనూ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఈ మార్గంలో విజయవాడ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా రాకపోకలు సాగించే ఈ మార్గంలో విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు పేరుతో రైళ్లను రామవరప్పాడు రైల్వేస్టేషన్లో ఆపేస్తున్నారు. దీంతో విజయవాడ నగర ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. రైళ్లు ఆలస్యంగా చేరుకోవడంతో ఒక్కోసారి రాత్రి 9 గంటలు దాటుతోంది. రి విజయవాడ మీదగా నడిచే దూర ప్రాంతాల రైళ్లను దారి మళ్లింపు పేరుతో వయా ఏలూరు మీద కాకుండా గుడివాడ, మచిలీపట్నం మార్గంలో మళ్లిస్తున్నారు. దీని కారణంగా ఎక్కువ సమయం తీసుకుంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పందన లేదు
-మూర్తి, ఉద్యోగి, గుడివాడ
పాక్షిక రద్దు పేరుతో పలు రైళ్లను రామవరప్పాడు స్టేషన్లో ఆపేస్తున్నారు. అక్కడి నుంచి నగరానికి ఆటోలో రావాలంటే రూ.100 అడుగుతున్నారు. ఏడాదిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల