బైపాస్ పేరుతో... బరితెగింపు
‘‘కొత్తూరు తాడేపల్లిలో అర్ధరాత్రి మట్టి టిప్పర్ల భారీ రవాణాపై సమాచారం రావడంతో అధికారులు క్షేత్రానికి వెళ్లారు. లారీలను ఆపి ప్రశ్నిస్తే.. తమకు అనుమతులు ఉన్నాయనీ, విజయవాడ బైపాస్కు.. మేఘా ఇంజినీరింగ్ తరఫున రవాణా చేస్తున్నామని పత్రాలు చూపారు.
మేఘా పేరిట అనుమతులు
తరలించేది ప్రైవేటు వెంచర్లకే
మంత్రి అనుచరుల మట్టి దందా
ఈనాడు, అమరావతి
‘‘కొత్తూరు తాడేపల్లిలో అర్ధరాత్రి మట్టి టిప్పర్ల భారీ రవాణాపై సమాచారం రావడంతో అధికారులు క్షేత్రానికి వెళ్లారు. లారీలను ఆపి ప్రశ్నిస్తే.. తమకు అనుమతులు ఉన్నాయనీ, విజయవాడ బైపాస్కు.. మేఘా ఇంజినీరింగ్ తరఫున రవాణా చేస్తున్నామని పత్రాలు చూపారు. అధికారులు తలూపి వెనక్కు వచ్చారు. కానీ ఆ టిప్పర్లు రామవరప్పాడు సమీపంలో ఓ ప్రైవేటు వెంచర్కు వెళ్లి గ్రావెల్ను అక్కడ పోసి వచ్చాయి. ఒక టిప్పరు విలువ రూ.10 వేలు. ఇలా దాదాపు 50 ఎకరాల్లో వెంచర్ను కొన్ని రోజులుగా రాత్రుళ్లు నింపేస్తున్నారు.’’
విజయవాడ బైపాస్ రహదారి పనులు నాలుగు ప్యాకేజీల్లో రెండు పూర్తవగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మూడో ప్యాకేజీ మేఘా ఇంజినీరింగ్ సంస్థకు దక్కగా 96 శాతం పనులు పూర్తి చేసింది. కొంత ప్రాంతంలో ట్రయల్ రన్ వేసింది. ఒకటి రెండు ప్రాంతాల్లో అండర్పాస్ల వద్ద చిన్న పనులు మిగిలాయి. బైపాస్ నాలుగో ప్యాకేజీ నవయుగ-అదానీ గ్రూపు సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. గుంటూరు వైపు నిర్మాణం జరుగుతోంది. కానీ మేఘా సంస్థ పేరుతో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ మంత్రి అనుచరుడు రాత్రుళ్లు మట్టి తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. మేఘా సంస్థ పేరుతో అనుమతి పత్రాలు సృష్టించి అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి తవ్వకాలకు కళ్లెం పడినా.. మంత్రి అనుచరుడి దందా ఆగలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు సాంకేతిక పరిశీలన చేయకుండా బైపాస్ పేరుతో వదిలేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశించినా అంతే...
ఎన్నికల ముందు ఓ మంత్రి అనుచరుడు కాగిత ఇన్ఫ్రా పేరుతో జగనన్న కాలనీల మెరక అని తహసీల్దారు ఇచ్చిన అనుమతులతో జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లిలో కొండలను తవ్వేశారు. రాత్రుళ్లు తవ్వుతూ.. గ్రామస్థులు తిరగబడకుండా గుడ్విల్ పేరుతో మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు అదేమంత్రి సిఫార్సులతో మేఘా సంస్థను అడ్డంపెట్టుకున్నారు. కొత్తూరు తాడేపల్లిలో తవ్వకాలను తెదేపా కార్యకర్త జములయ్య ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మట్టి తవ్వకాలు ఆపేయాలని తహసీల్దారును ఆదేశించారు. ఏడాదిగా విజయవాడ గ్రామీణం, జి.కొండూరు, గన్నవరం మండలాల్లో ఇష్టానుసారం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు వైకాపా ప్రజాప్రతినిధుల అండతో చెలరేగి పోతున్నారు. వారి సిఫార్సులతో కలెక్టర్ నుంచి లేఖలు పొంది జగనన్న కాలనీల మెరక పేరుతో అరాచకాలు సాగించారు.
అంతటా గుల్లే...
కడప జిల్లా గుత్తేదారుకు వణుకూరు లే ఔట్ మెరక కోసం రూ.కోట్ల ఉపాధి హామీ నిధులు చెల్లించారు. కొండలు కరిగాయి.. కానీ వణుకూరు లే ఔట్ మాత్రం చిన్న వర్షానికే చెరువులా మారుతోంది. ఉపాధి నిధులు రూ.వంద కోట్ల వరకు కాలనీల మెరకకు కరిగిపోయాయి. జక్కంపూడి, వేమవరం, వసంతరాయలతిప్ప, గుబ్బలగుట్ట, షాబాద్లో వడ్లగట్టు, దొండతిప్పల్లో 200 ఎకరాల మేర తవ్వారు. వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, పాతపాడు, అటవీ, అసైన్డ్ భూములు, పట్టాలు, పోలవరం కట్టలు కాకుండా ఈ తవ్వకాలు కొత్తగా జరిగాయి. పాతవాటిపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. వివిధ సర్క్యులర్లు వివిధ రూపాల్లో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మట్టి ఎక్కడ..?
విజయవాడ బైపాస్ పేరుతో అధికారికంగా తరలుతున్న మట్టి ఎక్కడ నింపుతున్నారనేది అధికారులు పరిశీలించడం లేదు. చిన్నఅవుటపల్లి నుంచి సూరంపల్లి వరకు 30 కిమీ బైపాస్ రహదారి మేఘా సంస్థ నిర్మిస్తోంది. సూరంపల్లి వద్ద ఎక్కువ శాతం వీటీపీఎస్ బూడిద నింపారు. అండర్పాస్, పైవంతెనలకు ఎక్కువగా బూడిదనే వాడారు. కానీ మేఘా సంస్థ పేరుతో కొత్తూరు తాడేపల్లిలో దాదాపు 50 ఎకరాల్లో అనుమతి తీసుకున్నారు. నిరుడు మేఘా పేరుతో వైకాపా నాయకులే తవ్వకాలు సాగించారు. ఇప్పుడు మట్టి నింపే పనులన్నీ పూర్తయినా అదే పేరుతో ఇంకా తవ్వేస్తున్నారు. గతంలో గనుల శాఖ అధికారులు కేసు పెట్టినా.. ఓ వైకాపా నాయకుడు మంత్రి అండతో దందా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే మట్టి తవ్వడంతో ప్రైవేటుగా నివేశన స్థలాల్లో మట్టి నింపడానికి డిమాండ్ పెరిగింది. గతంలో రూ.6 వేలకు ఇచ్చే టిప్పరు ఇప్పుడు రూ.10 వేలకు అమ్ముతున్నారు. కొందరు గ్రామస్థులు గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. దానిని ఎన్నికల సంఘానికి పంపారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆదివారం రెండు టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులను మాత్రం గుర్తించలేదు. అసలు గనుల శాఖ అనుమతులకు, ఈ తవ్వకాలకు పొంతన లేదు. అధికారిక తవ్వకాలైతే.. రాత్రి రవాణాలో ఆంతర్యం ఏంటనేది అధికారులకే తెలియాలి. మరోవైపు యంత్రాలను పగలు మామిడి తోటల్లో దాచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..