గుంతలు.. ప్రాణం తీసేస్తున్నాయి
పెనమలూరు నియోజకవర్గంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోతూనే ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
మద్దూరు లంకభూముల సమీపంలో ఇసుక తవ్వేసిన ప్రదేశం
కంకిపాడు, న్యూస్టుడే : పెనమలూరు నియోజకవర్గంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోతూనే ఉన్నాయి. మద్దూరు, కాసరనేనివారిపాలెం, చోడవరం, పెదపులిపాక, యనమలకుదురు నదీపాయల్లో స్నానానికని వెళుతున్న బాలలు, యువకులు మృత్యువాత పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఎక్కడంటే అక్కడ ఇసుకను తోడివేయడంతో 5 నుంచి 8 అడుగులలోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. కరకట్ట, లంకభూములకు సమీపంలోనే భారీ స్థాయిలో ఇసుక, బుసక (మట్టితోకూడిన సన్న ఇసుక) తోడేశారు. మద్దూరు పుష్కరఘాట్కు సమాంతరంగా కిలోమీటరు మేర ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలు జరిగిన సమయంలో విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం, నివేదికను ట్రైబ్యునల్కు పంపడం, చర్యలు తీసుకున్నామని ప్రకటించడం..ఇదంతా షరా మామూలైంది. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు కార్యాచరణలో లేవు. దీంతో నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి.
వీటికి ముగింపు ఎన్నడో..?: వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాల నుంచి నదీ పరివాహక గ్రామాలకు బాలలు, యువకులు వస్తుంటారు. వీరిలో కొందరు సరదాగా స్నానం చేసేందుకు నదిలో దిగుతుంటారు. వీరికి ప్రమాదకర గుంతలు, ఊబిలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. పైభాగంలో నీరు నిశ్చలంగా ఉన్నట్లు కనపడుతున్నా, అడుగు భాగంలో ప్రవాహం ఉంటుంది.కాలికి అడుగుభాగం (ఇసుక) తాకుతుందనే ఉద్దేశంతో పిల్లలు మరింత ముందుకు వెళుతుంటారు. అదే ప్రాణం మీదికి తెస్తోంది. ఈత బాగా వచ్చినా ఒక్కసారిగా గుంత, ఊబిలోకి జారే క్రమంలో పట్టుతప్పి మునిగిపోతుంటారని స్థానికులు చెబుతున్నారు.
హెచ్చరిక బోర్డులు అవసరం
నదిలోకి ఈతకు వెళ్లేవారికి గతంలో జరిగిన ప్రమాదాలను తెలియజేసి హెచ్చరించాలి. నదిలో ఏర్పడిన గుంతల గురించి కూడా వివరించాలి. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే