అల్లర్లు సృష్టించి... ఆట కట్టించి
కొంతమంది ఆందోళనకారులుగా, మరికొందరు పోలీసులుగా ఇలా బృందాలుగా ఏర్పడి అల్లర్లు సృష్టించడం, లాఠీఛార్జి చేయడం, నీళ్లు చల్లడం, గాల్లోకి కాల్పులు జరపడం లాంటి పలు సన్నివేశాలు చూసిన ప్రజలు ఏంజరిగిందో తెలియక ఆశ్చర్యంగా తిలకించారు.
ఆకట్టుకున్న మాక్డ్రిల్
ఆందోళనకారులను అడ్డుకుంటున్న సన్నివేశం
మచిలీపట్నం కార్పొరేషన్,న్యూస్టుడే: కొంతమంది ఆందోళనకారులుగా, మరికొందరు పోలీసులుగా ఇలా బృందాలుగా ఏర్పడి అల్లర్లు సృష్టించడం, లాఠీఛార్జి చేయడం, నీళ్లు చల్లడం, గాల్లోకి కాల్పులు జరపడం లాంటి పలు సన్నివేశాలు చూసిన ప్రజలు ఏంజరిగిందో తెలియక ఆశ్చర్యంగా తిలకించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసుశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేసేందుకు గురువారం మచిలీపట్నంలోని కోనేరుసెంటరులో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. మొదటి పోలీసులు జన సమూహాలను వెళ్లిపోవాల్సిందిగా మైక్ద్వారా హెచ్చరికలు జారీ చేయగా, తరువాత బాష్పవాయువు ప్రయోగం, ఆ వెంటనే లాఠీఛార్జి చేయడం, అప్పటికీ అదుపులోకి రాకపోతే నీళ్లు చల్లడం, ప్లాస్టిక్బుల్లెట్లతో కాల్పులు చేయడం, అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే కాల్పులు చేయడం ఇలా విడతలవారీగా పోలీసులు అల్లర్లను అడ్డుకునేందుకు ఏమేమి చేస్తారో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ మాట్లాడుతూ ప్రజల అందరి సహకారంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసిందని, కౌంటింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అందరూ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని విద్రోహ చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటామో అవగాహన కల్పించేందుకే ఈ మాక్డ్రిల్ నిర్వహించామని చెప్పారు. పోలీసులు ప్రదర్శించిన సన్నివేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ ఎస్వీడి ప్రసాద్, ఎస్బీ సీఐ జేవీ రమణలు పర్యవేక్షించగా డీఎస్పీ అబ్దుల్ సుభాన్, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పర్యవేక్షిస్తున్న ఎస్పీ
గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు
టైర్లు కాలుస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.