రూ.50 లక్షల వ్యయం.. పనుల్లో డొల్లతనం
హనుమాన్జంక్షన్ పైవంతెన వాహనదారులను భయాందోళనలకు గురి చేస్తోంది.
పైవంతెన గోతులమయం
దెబ్బతిన్న పిల్లర్ జాయింట్లు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
ధ్వంసమైన వంతెన రెయిలింగ్
హనుమాన్జంక్షన్ పైవంతెన వాహనదారులను భయాందోళనలకు గురి చేస్తోంది. అడుగడుగునా గుంతలమయంగా మారి ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా తయారవడంతో రాకపోకలు సాగించే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నామమాత్రపు మరమ్మతులతో సరిపెట్టడం, దిగువన పిల్లర్ల సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తడంతో ఎప్పుడు ఎలాంటి అనర్థం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల కిందటే నూజివీడు వైపు వంతెన దిగువున పిల్లర్ వద్ద జాయింట్లు దెబ్బతిని, భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో విపరీతంగా కుంగుతూ కన్పించింది. దీంతోపాటు పలుచోట్ల వంతెనకు ఇరువైపులా ఉన్న సిమెంట్ రెయిలింగ్ ధ్వంసమవ్వడం ప్రమాద సంకేతాన్నిస్తోంది.
పెడన-విస్సన్నపేట జాతీయ రహదారిపై రాకపోకలకు హనుమాన్జంక్షన్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద తీవ్ర విఘాతం ఏర్పడుతుండడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి తెదేపా ప్రభుత్వం పై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రహదారులు, భవనాలు శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన నిర్వహించారు. రైల్వే పరిధిలో చేపట్టే నిర్మాణానికి అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ భూమిపూజ చేశారు.
మట్టిని ఇలాగే వదిలేశారు..
మూణ్ణాళ్ల ముచ్చటే: 2009లో పూర్తి స్థాయిలో వంతెన అందుబాటులోకి రావడంతో రాకపోకలు సాఫీగా జరగడం మొదలైంది. కానీ నిర్మాణంలో సరైన ప్రమాణాలు లేకపోవడంతో అనతి కాలంలోనే వంతెన మార్గం ధ్వంసమైంది. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకుంటూ వచ్చారు. మూడేళ్ల కిందట మాత్రం రూ.50 లక్షల వ్యయంతో నిర్వహణ పనులు చేపట్టారు. రెండు వారాలకు పైగా రాకపోకలు పూర్తిగా నిలిపివేసి మరీ చేసిన ఈ మరమ్మతులు కూడా ముణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. ఎక్కడికక్కడ గుంతలు, ఇనుపచువ్వలు బయటకు చొచ్చుకురావడం షరా మామూలే అన్నట్లుగా తయారైంది పరిస్థితి.
ఫిర్యాదు చేసినా..: వంతెన పైభాగం పరిస్థితి ఇలా ఉంటే, దిగువన కొన్నిచోట్ల మరింత ప్రమాదకరంగా తయారైంది. బాపులపాడు డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారికి సరిగ్గా ఎదురుగా ఉన్న పిల్లర్ పలుచోట్ల దెబ్బతినిపోయింది. పైభాగాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేపట్టిన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఓ మోస్తరు నుంచి అతి భారీ వాహనాలు వెళ్లే సమయంలో వంతెన కుంగుబాటుకు గురవతూ, గాల్లో కిందకు, పైకి లేస్తుంది. గతంలో మరమ్మతులు చేపట్టిన క్రమంలో జాయింట్ల వద్ద తవ్వకాలు చేపట్టారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఈ తరహా కుంగుబాటుని గమనించిన స్థానికులు అధికార్లకు ఫిర్యాదు చేశారు. కానీ నేటి వరకు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారధిపై ఈ తరహా గుంతలు సర్వసాధారణం
ఇదీ వంతెన చరిత్ర..
నిర్మాణం తలపెట్టింది: 2003లో
ఎక్కడ: విజయవాడ-విశాఖ రైల్వే మార్గంలో 336 లెవల్ క్రాసింగ్ వద్ద
ఎంత దూరం: 880 మీటర్లు
అధికారికంగా ప్రారంభించింది: 2009, ఫిబ్రవరి 22
అధికారులకు పట్టదు
లారీలు అదుపు తప్పి ఢీకొట్టడంతో వంతెనకు ఇరువైపులా నిర్మించిన సిమెంట్ రెయిలింగ్ రెండుచోట్ల బాగా ధ్వంసమైంది. అప్రమత్తంగా లేకుంటే వీటి మీదుగా వాహనాలు దూసుకుపోయి కింద పడే ప్రమాదం పొంచి ఉంది. పైగా రెయిలింగ్ ధ్వంసమైన సమయంలో కొన్నిచోట్ల శిథిలాలు అలాగే వేలాడుతూ, ఏక్షణమైనా కింద పడొచ్చనే రీతిలో ఉన్నాయి. సర్వీసు రోడ్లలో రాకపోకలు సాగించేవారిపై ఇవి పడేందుకు ఆస్కారం ఉంది. అయినా కూడా ఆర్అండ్బీ అధికారులెవ్వరూ కూడా తమకేం సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా ఇటీవల మట్టి ట్రాక్టరు ప్రమాదానికి గురవడంతో వంతెన మీదే మట్టిని వదిలేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు