రవాణా సేవలకు సాంకేతిక సంకటం
రవాణా శాఖ ద్వారా వాహన యజమానులకు అందుతున్న సేవలు బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా నిలిచిపోయాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాహన యజమానులకు ఇబ్బందులు
సూర్యారావుపేట, న్యూస్టుడే
రవాణా శాఖ ద్వారా వాహన యజమానులకు అందుతున్న సేవలు బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని వాహనదారులకు ‘ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతి’తో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పరివాహన్ సారథి’ ద్వారా రవాణాశాఖ సేవలు అందిస్తున్నారు. కొద్ది నెలలుగా ఈ రెండు సైట్లు పలుమార్లు నిలిచిపోతుండటంతో వాహన యజమానులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం నుంచి పలు సేవలకు బ్రేక్ పడింది. కేవలం ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ వంటివి మాత్రమే అందుబాటులో ఉండటం.. మిగిలిన అన్ని రకాల సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక కారణాల వల్ల సేవలు నిలిచిపోయాయని అధికారులు అంటున్నా సర్వర్ నిర్వహణ నిమిత్తం రవాణాశాఖ ప్రైవేటు సంస్థకు రూ.కోట్లలో బకాయి ఉండటంతో సేవలను అర్ధంతరంగా నిలిపివేశారు.
రవాణా శాఖ ద్వారా వాహన యజమానులకు పలు రకాల సేవలు అందుతుంటాయి. ఎల్ఎల్ఆర్, కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణ, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ, వాహనాల రెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, నిరంభ్యంతర పత్రాల జారీ, త్రైమాసిక పన్నుల చెల్లింపులు, ఈ చలనాల వసూళ్లు, పర్మిట్లు తదితర సేవలు అందిస్తారు. ఈ సేవల నిమిత్తం నిత్యం వందలాది మంది ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుంటారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల్లోని అధికారులు ఆయా దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం లైసెన్సులు, కొత్త రిజిస్ట్రేషన్లు తరచుగా ఆగిపోతున్నా ఈ సేవలు మాత్రమే వాహన యజమానులకు అందుబాటులో ఉన్నాయి.
రోజుకు 2,500 సేవలు
జిల్లాల ఏర్పాటు తరువాత కార్యాలయాల విభజన జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఉపరవాణా కమిషనర్ కార్యాలయం (డీటీసీ), నందిగామ ఆర్టీఓ కార్యాలయం, జగ్గయ్యపేటలో యూనిట్ కార్యాలయం ఉంది. అదే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయం (డీటీఓ), గుడివాడ ఆర్టీఓ కార్యాలయం, ఉయ్యూరు యూనిట్ కార్యాలయం ఉంది. వీటిలో విజయవాడ డీటీసీ కార్యాలయం, మచిలీపట్నం డీటీఓ కార్యాలయాలు ప్రధానమైనవి. ఈ 6 కార్యాలయాల ద్వారా నిత్యం 2,500 మంది పలు రకాల సేవలను వినియోగించుకుంటారు. ప్రధానమైనవి ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్సులు. ఈ రెండు జిల్లాల్లో కేవలం ఎల్ఎల్ఆర్లు, డ్రైవింగ్ లైసెన్సులే రోజుకు 800 నుంచి 1000 వరకు ఉంటాయి. మిగిలినవన్నీ ఇతర రకాల సేవలు.
అధికారుల తప్పిదమే..
ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతి నుంచి సేవలను ఒక్కొక్కటిగా కేంద్ర సర్వర్ ‘పరివాహన్ సారథి’లోకి మారుస్తున్నారు. ఏడాది కాలంగా ఇది జరుగుతున్నా తరచూ కేంద్ర సర్వర్ మొరాయించి సేవలు ఆలస్యం అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా వాహన యజమానులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా బకాయిల కారణంగా సేవలు నిలిచిపోవడంతో వాహన యజమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని యజమానులు కోరుతున్నారు.
పన్ను చెల్లింపుదారులుంటే
రవాణా వాహనాల యజమానులు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్నులు చెల్లించాలి. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఏప్రిల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం త్రైమాసిక పన్ను చెల్లింపులు ఉండవు. ఒక వేళ ఉంటే రవాణాశాఖ కార్యాలయాల ద్వారా లభ్యమయ్యే సేవలు వేలల్లో ఉంటాయి. ప్రస్తుతం త్రైమాసిక పన్నులు చెల్లింపులు లేకపోవడంతో రవాణాశాఖ సేవలు నిలిచిపోయినా ఒక్కో కార్యాలయం పరిధిలో కేవలం వందల్లోనే ఇబ్బందులు పడుతున్నారు. అదే పన్ను చెల్లింపులుంటే వేలాది మంది ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అదృష్ట అన్వేషణ
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి