నిర్వహణకు తూట్లు.. అన్నదాతకు పాట్లు
నిర్వహణ లేక క్యాంప్బెల్ అక్విడెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.
పరిరక్షణ పట్టించుకోని ప్రభుత్వం
శిథిలావస్థకు చేరిన క్యాంప్బెల్ అక్విడెక్టు
న్యూస్టుడే, అవనిగడ్డ గ్రామీణం
నిర్వహణ లేక క్యాంప్బెల్ అక్విడెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దివిసీమ ముఖద్వారమైన పులిగడ్డలో కృష్ణా నదిపై 1936లో కింది భాగాన నీటి ప్రవాహానికి తొట్టె, పైభాగం రవాణా మార్గంగా అక్విడెక్టు నిర్మించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని సుమారు 72 వేల ఎకరాలకు సాగు నీరు, 45 పంచాయతీలకు తాగు నీరు అందిస్తున్న పులిగడ్డ క్యాంప్బెల్ అక్విడెక్టు ఇంతకాలం దివిసీమ వరప్రదాయనిలా నిలిచింది. ఏటా మరమ్మతులు చేసి ఈ కట్టడాన్ని పరిరక్షించడానికి నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరైన నిర్వహణ లేక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
రెయిలింగ్స్ విరిగి వేలాడుతున్నాయిలా..
- ఏటా పంటకాలం పూర్తయిన తర్వాత అక్విడెక్టుకు మరమ్మతులు చేసి రంగులద్దేవారు. ఈ మేరకు నీటి పారుదల శాఖలో కొంత బడ్జెట్ కేటాయింపు ఉండేది. ఈ ఏడాది ఇంత వరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. జూన్ నెలలో పంట కాల్వలకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. రైతులు ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.
- వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్విడెక్టు కనీస మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుతోందని దివివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రూ.53 లక్షలు మంజూరు కాగా నీటి పారుదలకు అవసరమైన పనులు ఏప్రిల్ నెలలోనే చేయించామని అప్పట్లో ఎమ్మెల్యే సింహాద్రిరమేష్బాబు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 16న జలవనరుల శాఖ ఈఈ కృష్ణారావు అక్విడెక్టు పరిశీలనకు వచ్చి రూ.4 లక్షల మేరకు పనులు చేసినట్లు, గుత్తేదారుడికి ఇంకా బిల్లులు చెల్లించలేదని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అడుగు భాగాన ఊడిపోయిన ఇనుప మూత
- అక్విడెక్టు అడుగు భాగాన ఉన్న ఛాంబర్లకు ఇనుప మూతలు కొన్నింటికి ఊడిపోగా మరికొన్నింటికి ఉన్నవి తుప్పు పట్టి వేలాడుతున్నాయి. పిల్లర్లపై గడ్డి మొక్కలు దట్టంగా మొలిచాయి. అడుగుభాగంలో పగుళ్లిచ్చాయి. పైన ఉన్న రైయిలింగ్స్ విరిగిపోయాయి. అండర్ టన్నెల్స్ షట్టర్లు తుప్పు పట్టి అడుగుభాగం నుంచి నీరు నదిలోకి వృథాగా పోతోంది.
- స్లాబు పెచ్చులూడిపోయింది. రంగులు వెలిసి వెలవెలబోతోంది. అక్విడెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించి దివి వరప్రదాయనిని పరిరక్షించాలని ప్రజాప్రతినిధి, అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
- దీనిపై జలవనరుల శాఖ పులిగడ్డ సబ్డివిజన్ డీఈఈ మాట్లాడుతూ ఈ ఏడాది మరమ్మతులకు రూ.60 లక్షలకు ప్రతిపాదనలు పంపామని.. నిధులు ఇంకా మంజూరుకాలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం