నిర్వహణకు తూట్లు.. అన్నదాతకు పాట్లు
నిర్వహణ లేక క్యాంప్బెల్ అక్విడెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.
పరిరక్షణ పట్టించుకోని ప్రభుత్వం
శిథిలావస్థకు చేరిన క్యాంప్బెల్ అక్విడెక్టు
న్యూస్టుడే, అవనిగడ్డ గ్రామీణం
నిర్వహణ లేక క్యాంప్బెల్ అక్విడెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దివిసీమ ముఖద్వారమైన పులిగడ్డలో కృష్ణా నదిపై 1936లో కింది భాగాన నీటి ప్రవాహానికి తొట్టె, పైభాగం రవాణా మార్గంగా అక్విడెక్టు నిర్మించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని సుమారు 72 వేల ఎకరాలకు సాగు నీరు, 45 పంచాయతీలకు తాగు నీరు అందిస్తున్న పులిగడ్డ క్యాంప్బెల్ అక్విడెక్టు ఇంతకాలం దివిసీమ వరప్రదాయనిలా నిలిచింది. ఏటా మరమ్మతులు చేసి ఈ కట్టడాన్ని పరిరక్షించడానికి నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరైన నిర్వహణ లేక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
రెయిలింగ్స్ విరిగి వేలాడుతున్నాయిలా..
- ఏటా పంటకాలం పూర్తయిన తర్వాత అక్విడెక్టుకు మరమ్మతులు చేసి రంగులద్దేవారు. ఈ మేరకు నీటి పారుదల శాఖలో కొంత బడ్జెట్ కేటాయింపు ఉండేది. ఈ ఏడాది ఇంత వరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. జూన్ నెలలో పంట కాల్వలకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. రైతులు ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.
- వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్విడెక్టు కనీస మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుతోందని దివివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రూ.53 లక్షలు మంజూరు కాగా నీటి పారుదలకు అవసరమైన పనులు ఏప్రిల్ నెలలోనే చేయించామని అప్పట్లో ఎమ్మెల్యే సింహాద్రిరమేష్బాబు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 16న జలవనరుల శాఖ ఈఈ కృష్ణారావు అక్విడెక్టు పరిశీలనకు వచ్చి రూ.4 లక్షల మేరకు పనులు చేసినట్లు, గుత్తేదారుడికి ఇంకా బిల్లులు చెల్లించలేదని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అడుగు భాగాన ఊడిపోయిన ఇనుప మూత
- అక్విడెక్టు అడుగు భాగాన ఉన్న ఛాంబర్లకు ఇనుప మూతలు కొన్నింటికి ఊడిపోగా మరికొన్నింటికి ఉన్నవి తుప్పు పట్టి వేలాడుతున్నాయి. పిల్లర్లపై గడ్డి మొక్కలు దట్టంగా మొలిచాయి. అడుగుభాగంలో పగుళ్లిచ్చాయి. పైన ఉన్న రైయిలింగ్స్ విరిగిపోయాయి. అండర్ టన్నెల్స్ షట్టర్లు తుప్పు పట్టి అడుగుభాగం నుంచి నీరు నదిలోకి వృథాగా పోతోంది.
- స్లాబు పెచ్చులూడిపోయింది. రంగులు వెలిసి వెలవెలబోతోంది. అక్విడెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించి దివి వరప్రదాయనిని పరిరక్షించాలని ప్రజాప్రతినిధి, అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
- దీనిపై జలవనరుల శాఖ పులిగడ్డ సబ్డివిజన్ డీఈఈ మాట్లాడుతూ ఈ ఏడాది మరమ్మతులకు రూ.60 లక్షలకు ప్రతిపాదనలు పంపామని.. నిధులు ఇంకా మంజూరుకాలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిపించే కథానాయకుడు.. నాన్న
[ 16-06-2024]
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న.. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే.. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. -
‘నా’ కన్నా.. నేను‘న్న’
[ 16-06-2024]
చిరుపలుకులకు వన్నెలు..బుడిఅడుగులకు వెన్నలు.. నడిపించే నవశక్తివి.. నను మలిచే యుక్తివి..ఓర్పునిచ్చే అండవి.. నేర్పుకూర్చే ఆప్తుడివి.. -
ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ‘మెగా’ వెలుగులు
[ 16-06-2024]
ఎన్నాళ్లో వేచిన ఉదయం... ఇన్నాళ్లకు చేరువైంది.. మెగా డీఎస్సీ రూపంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కొలువు కలలు నెరవేరే సందర్భం రానే వచ్చింది. -
చెత్తపన్నుకు చెల్లుచీటీ!
[ 16-06-2024]
చెత్తపన్ను నుంచి నగర, పట్టణవాసులకు ఉపశమనం లభించింది. అధికారంలోకి రాగానే ఈ పన్నును నిలిపేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. -
గన్నవరం విమానాశ్రయం భద్రతకు సీఐఎస్ఎఫ్
[ 16-06-2024]
గన్నవరం విమానాశ్రయం భద్రతను జులై 02 నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు అప్పగించనున్నారు. ఏపీ పోలీసులు ఇప్పటి వరకూ విమానాశ్రయం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
చంద్రబాబుకు ఎవరూ సాటిరారు
[ 16-06-2024]
ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధికి ఎవరూ సాటిరారని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
[ 16-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. -
బాబాయ్ అని ఇల్లు గుల్ల చేశారు
[ 16-06-2024]
అది జాతీయ రహదారి పక్కన దుకాణం.. సమయం రాత్రి 10 గంటలు.. జనసంచారం ఉండే ప్రాంతం.. నిత్యం వీఐపీల తాకిడి ఉంటుంది. అలాంటి ప్రాంతంలోని ఓ దుకాణానికి వచ్చిన దుండగుడు బాబాయ్ అంటూ మాట కలిపాడు.. ఆ ఇంట్లో వృద్ధులే ఉంటారని తెలుసుకున్నాడు.. -
కాపురానికి రావడం లేదని కత్తితో దాడి
[ 16-06-2024]
భార్య కాపురానికి రావడం లేదని భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం చెవుటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామానికి చెందిన వీరిశెట్టి రంగారావుకు కృష్ణాజిల్లా ఊటుకూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన రత్నకుమారికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. -
శ్రీశ్రీ సాహిత్యం అజరామరం
[ 16-06-2024]
జన చైతన్యం ఆశిస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చిన శ్రీశ్రీ సాహిత్యం అజరామరమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. -
వైకాపా భూస్థాపితం : మాజీ ఎమ్మెల్సీ
[ 16-06-2024]
ఎన్నికల ఫలితాలతో అరాచక వైకాపా భూస్థాపితం అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. నగరంలోని మల్లికార్జునపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.