బాదుడే మా పని.. బాధలు మాకేమని..!
విజయవాడ నుంచి జగదల్పూర్ వరకు జాతీయ రహదారి (ఎన్హెచ్-30) విస్తరణను కేంద్రం చేపట్టింది. 2016లోనే నిర్మాణం చేపట్టారు.
ఐదేళ్లుగా ఎడాపెడా టోల్ ఛార్జీల వసూలు
అత్యంత దారుణంగా ఎన్హెచ్-30 నిర్వహణ
రహదారితో ప్రమాదాల బారిన ప్రయాణికులు
ఈనాడు, అమరావతి
ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి కొండపల్లి వరకు రహదారి ఇలా...
ఇది టోల్ పన్నులు చెల్లించే జాతీయ రహదారి. ప్రతి 50 కిమీ చొప్పున టోల్ వసూలు చేయాలని నిర్ణయించి రెండు చోట్ల టోల్ప్లాజాలు పెట్టి పన్ను వసూలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో మూడుసార్లు టోల్ ధరలు పెంచినా నిర్వహణ దారుణంగా ఉంది. విజయవాడ-జగదల్పూర్ (ఎన్హెచ్-30) జాతీయ రహదారి దుస్థితి ఇది. కొండపల్లి ప్రాంతంలో రహదారి ఇలా తయారైనా అధికారులు, గుత్తేదారుకు పట్టలేదు.
ఇది ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద జాతీయ రహదారే. 1.5 కిమీ దూరం ఉన్న ఈ గ్రామంలో దారి దారుణంగా ఉంది. ఇదిగో.. అదిగో వేస్తున్నాం అనడంతోనే సరి. దుమ్ము ధూళి లేచి నివాసాలపై పడి ప్రజలు రోగాల పాలవుతున్నారు. గ్రామంలో మీటరు లోతు గోతులతో దారుణంగా ఉంది. ఇక్కడ బైపాస్ వేయాల్సి ఉన్నా.. అధికారులు పట్టుబడి గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి నిర్మాణానికి నాంది పలికారు. గుత్తేదారు దీనిని పూర్తి చేయకనే వెళ్లిపోగా ప్రజాప్రతినిధులూ విస్మరించారు.
విజయవాడ నుంచి జగదల్పూర్ వరకు జాతీయ రహదారి (ఎన్హెచ్-30) విస్తరణను కేంద్రం చేపట్టింది. 2016లోనే నిర్మాణం చేపట్టారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు, తిరిగి తిరువూరు నుంచి భద్రాచలం వరకు మొత్తం 170 కిలోమీటర్లు దూరాన్ని దిలీప్ బిల్డ్కాన్ సంస్థకు అప్పగించారు. తిరువూరు వరకు 68 కిమీ నిర్మాణం పూర్తయింది. భద్రాచలం వరకు కొంత నిర్మాణంలో ఉంది. రూ.1,500 కోట్ల టెండర్తో ఎన్టీఆర్ జిల్లాలో 68 కిమీ దూరాన్ని రెండు వరసలుగా వేశారు. గ్రామాలు ఉన్నచోట నాలుగు వరసలు నిర్మించారు. తిరువూరు నుంచి కొత్తగూడెం వరకు పూర్తి చేశారు.
రూ.కోట్లలో ఆదాయం...
ఎ.కొండూరు మండలం బాడవ వద్ద ఒక టోల్ప్లాజా, పెనుబల్లి మండలం గౌరవరం వద్ద మరో టోల్ప్లాజా పెట్టి 2018 నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. బాడవ వద్ద మొదట కారుకు రూ.25, తర్వాత 45, రెండేళ్ల కిందట రూ.70 చేశారు. గౌరవరం వద్ద రూ.40 వసూలు చేస్తున్నారు. నిత్యం 2,500 వాహనాలు వెళ్తుంటాయి. భద్రాచలం పుణ్యక్షేత్రం కావడం, ఛత్తీస్ఘడ్కు అనుసంధాన దారి కావడంతో భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. టోల్ వసూలుతో రూ.కోట్ల ఆదాయం వస్తుంది.
నిర్వహణ దారుణం..
ఎత్తుపల్లాలతో ప్రమాదకరంగా..
ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి జి.కొండూరు వరకు రోడ్డు మొత్తం కిందకు అణిగిపోయి ఎత్తుపల్లంగా ఉంది. వాహనం వెళుతుంటే ఛాసిస్ రోడ్డుకు తాకేలా ఉంది. కనీసం ద్విచక్ర వాహనాలు సాఫీగా వెళ్లలేకున్నాయి. కొండపల్లి రైల్వే బ్రిడ్జి పార్టు పూర్తి చేయలేదు. టోల్ వసూలు చేసే రోడ్డు.. నిరంతర నిర్వహణ ఉండాలి. కొండపల్లి వద్ద భారీ వాహనాలు తిరుగుతుంటాయి. అందుకే రోడ్డు కుంగిందని పట్టించుకోవడం మానేశారు. జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో 50 వరకు కల్వర్టులు ఉన్నాయి. కొన్ని బాక్సు టైప్, తూముల కల్వర్టులు ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ల తరహాలో రోడ్డు ఉంది. వాహనం వేగంగా వెళుతుంటే ఎగిరిపడి ప్రయాణీకులకు గాయాలవుతున్నాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బాబోయ్ అంటున్నారు. పలు వాహనాలు కల్వర్టుల వద్ద పల్టీలూ కొట్టాయి. ఇబ్రహీంపట్నం-తిరువూరు రహదారి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు గుత్తేదారుకు ఇచ్చారు. ఏటా రూ.2.50-5 కోట్లు చెల్లిస్తున్నారు. నిధులు దోచిపెట్టడమే తప్ప నిర్వహణ లేనేలేదనే విమర్శలున్నాయి.
తారు కుంగిపోయి..
అయిదేళ్లుగా దస్త్రం కదల్లేదు..
ఎ.కొండూరులో నరకం కనిపిస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. సుమారు 1.50 కిమీ దారి నిర్మించకుండా వదిలేయగా భారీ గుంతలుపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని ఇళ్లు తొలగించాలి. 30 ఇళ్లు తొలగించి పరిహారం చెల్లించారు. ఆరింటికి చెల్లించలేదు. అయిదేళ్లుగా పరిహారం దస్త్రం కదల్లేదు. ఈ రహదారి తన కృషితోనే వేశామని చెప్పే ఎంపీ కేశినేని నాని రామచంద్రాపురం గ్రామస్థుల సమస్య పట్టించుకోలేదు. వాస్తవానికి గ్రామంలో రహదారి వద్దనీ.. బైపాస్ వేయాలని గ్రామస్థులు కోరారు. పట్టుబడి ఇక్కడ గ్రామం నుంచి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించి సమస్యలు తెచ్చారు. పరిహారం సమస్య విస్మరించడమే కాక.. గోతులను సైతం పూడ్చలేదు.
ఎక్కడ బాగాలేదో చెప్పండి..!
జాతీయ రహదారుల పీడీ నారాయణరెడ్డిని ‘ఈనాడు’ వివరణ కోరగా... రామచంద్రాపురంలో ఆరు ఇళ్లకు పరిహారం ఇవ్వాలి. ఆర్అండ్బీ అంచనా ఇవ్వాలి. పరిహారం పూర్తయితే టెండర్లు పిలిచి అప్పగిస్తాం. రహదారి ఎక్కడ బాగాలేదో చెప్పండి అంటూనే.. ఇంజినీరుతో తనిఖీకి వెళ్లాలని సూచించారు. కొండపల్లి, కల్వర్టుల వద్ద నిర్వహణ చేపట్టామన్నారు. ఎన్హెచ్ ఇంజినీరు అనిల్ మాట్లాడుతూ.. కల్వర్టుల వద్ద త్వరలో మరమ్మతు చేయిస్తామనీ.. కొండపల్లి వద్ద మరో బీటీ పొర వేస్తున్నామన్నారు.
బలవంతంగా కూల్చారు..!
మా ఇళ్లు బలవంతంగా కూల్చేశారు. పరిహారం ఇచ్చారు. కానీ ఇంత వరకు రోడ్డు వేయలేదు. దుమ్ముధూళి, వర్షాకాలం బురదతో సహజీవనం చేస్తున్నాం. రోగాలు వస్తున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు.
గోపాలరావు, రామచంద్రాపురం
ప్రమాదాలు జరుగుతున్నాయి.!
చాలా ఏళ్లుగా ఇలాగే ఉంది. ఈ దారి బాగు చేసేవారు లేరు. స్థానికులే అప్పుడప్పుడు మట్టి వేసి గుంతలు నింపుతున్నారు. మళ్లీ రెండు రోజులకు మామూలే. నిత్యం వాహనాల రద్దీతో దుమ్ము రేగి అల్లాడుతున్నాం. బైపాస్ వేయాలని మేం కోరితే అసలు పట్టించుకోలేదు.
బి.వెంకటేశం, రామచంద్రాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు