ఏటా ముంపు.. ఏది కనువిప్పు
వానొస్తే నగరంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అవుట్ ఫాల్, వర్షపునీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీత పనులు నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండదు.
డ్రెయిన్ల పూడికతీత పనుల్లో అధికారుల నిర్లక్ష్యం
రూ.కోట్లలో వెచ్చిస్తున్నా కనిపించని ఫలితం
స్టెల్లా కళాశాల వద్ద సర్వీస్రోడ్డులో నిలిచిన వర్షపు నీరు
విజయవాడనగరపాలక సంస్థ, న్యూస్టుడే: వానొస్తే నగరంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అవుట్ ఫాల్, వర్షపునీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీత పనులు నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండదు. కానీ నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా దృష్టిసారించడం లేదు. నగరంలో నిత్యం ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో 20 మెట్రిక్ టన్నుల మట్టి, వ్యర్థాలు నేరుగా డ్రెయిన్లలోకి చేరిపోతున్నాయి. పలువురు వ్యాపారులు, హోటళ్ల యజమానులు, చిరువ్యాపారులు వ్యర్థాలను నేరుగా డ్రెయిన్లలో వేస్తున్నారు. రహదారులను శుభ్రం చేసే సిబ్బంది సైతం ఇదే విధంగా చేస్తున్నారు. వీటిని నిలువరించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలం అవుతున్నారు. గతంలో కాలువలను శుభ్రం చేసేందుకు 10-15 మంది పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్వర్కు నిర్వహించేవారు. కొద్దికాలంగా దీనికి అధికారులు మంగళం పాడారు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ముందెందుకు మేల్కోరూ..?
- జూన్ మధ్య నుంచి వర్షాలు మొదలవుతాయి. పూడికతీత పనులకు జనవరి-ఫిబ్రవరి నుంచి ఆలోచన చేయాలి. టెండర్లు పిలిచి మే నెలాఖరుకలా పనులు పూర్తిచేయాలి. గడచిన కొంతకాలంగా జూన్, జులైలో పూడికతీత పనులు చేస్తున్నారు. ఫలితంగా వర్షం పడగానే తీసిన వ్యర్థాలు తిరిగి డ్రెయిన్లలోకి చేరిపోతూ సమస్య మొదటికొస్తుంది. అదే అదనుగా కొద్దిపాటి పూడిక తీసి మొత్తం పని చేసినట్లుగా గుత్తేదార్లు బిల్లులు చేసుకుంటున్నారు. వారి నుంచి అధికారులు, పాలకులు కమీషన్లు దండుకుంటున్నారు.
ఏటా రూ.కోట్ల వ్యయం..!
ఏటా 25-50 కిలోమీటర్ల మేరకు డ్రెయిన్ల పూడికలు తీసేందుకు రూ.2.50 నుంచి రూ.3.00 కోట్లు వ్యయం చేస్తున్నారు. కనిష్ఠంగా ప్రతి నియోజకవర్గంలో రూ.80 లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.3 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. కానీ వేసవిలో పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో కార్పొరేషన్ యంత్రాలు, సిబ్బందితో పూడికలు తీస్తున్నారు. దీనిపై చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పనులు ఆలస్యమయ్యాయని, కోడ్ ముగిశాక వెంటనే పూడిక తీయిస్తామని చెప్పారు.
పనులు చేపట్టే ప్రాంతాలు ఇలా..
అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో ఏటా పూడికతీత పనులు చేస్తారు.ప్రధానంగా విద్యాధరపురం అంబేడ్కర్రోడ్డు, సితార జెంక్షన్ నుంచి కబేళారోడ్డు
- పాతబస్తీ డ్రెయిన్ స్ట్రీట్, గణపతిరావురోడ్డు నుంచి జెండాచెట్టు, సుబ్బరామయ్యవీధి.
- ఒన్టౌన్ మెయిన్బజార్ నుంచి బీఆర్పీ రోడ్డు వరకు
- చిట్టినగర్ కెటిరోడ్డు కలరా ఆస్పత్రి నుంచి సీవీఆర్ పైవంతెన
- కేఎల్ రావునగర్ అవుట్ఫాల్ డ్రెయిన్ మిల్క్ ప్రాజెక్టు నుంచి కెఎల్.రావు నగర్ రోడ్డు నంబరు 8 వరకు
- నైజాంగేటు-కంసాలిపేట వరకు
- కంపాలిపేట నుంచి రైల్వేట్రాక్ జీరో బల్పు ఏరియా వరకు
- గాంధీ హిల్ నుంచి హనుమాన్పేట వరకు
- బైపాస్ నుంచి బుడమేరు వరకు
- మధురానగర్లోని పలు అంతర్గత డ్రెయిన్లు, సింగ్నగర్లోని అత్యధిక ప్రాంతాల డ్రెయిన్లు,
- పటమట లంక పలు డ్రెయిన్లు
- ఏపీఏఏసీ కాలనీ,
- కరెన్సీనగర్లోని అవుట్ డ్రెయిన్, అటోనగర్కు అనుబంధమైన డ్రెయిన్లు
- మొగల్రాజపురం, సున్నపుబట్టీల సెంటర్ ప్రాంతపు డ్రెయిన్లు
- మదర్ థెరిసా జెంక్షన్, డివిమేనర్రోడ్డు, జమ్మిచెట్టుసెంటర్ ఏరియా డ్రెయిన్లు,
- పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు
- లయోలా కళాశాల రోడ్డు డ్రెయిన్
- బృందావన్ కాలనీ ఇతర కాలనీల్లో డ్రెయిన్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి