ఆధునికీకరణ అన్నారు.. వసతులు మరిచారు..
2022లో పూర్తయిన విజయవాడ-మచిలీపట్నం డబ్లింగ్లో భాగంగా పెడన రైల్వేస్టేషన్ను ఆధునికీకరించినా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు.
పెడన రైల్వేస్టేషన్లో సమస్యల కూత
పెడన, న్యూస్టుడే: 2022లో పూర్తయిన విజయవాడ-మచిలీపట్నం డబ్లింగ్లో భాగంగా పెడన రైల్వేస్టేషన్ను ఆధునికీకరించినా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. మచిలీపట్నం రైల్వేస్టేషన్కు ముందు వచ్చే ఈ స్టేషన్ ఆర్థికపరంగా రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా ఇక్కడి సమస్యలను తీర్చడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించడం లేదు. ఫలితంగా ప్రయాణికుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి
ఫ్లాట్ఫాంపై పైకప్పు లేక ఇబ్బందులు
మచిలీపట్నం-విజయవాడ సెక్షన్లో మచిలీపట్నం, గుడివాడల తర్వాత పెడన స్టేషన్ ఆదాయ పరంగా మూడోస్థానంలో నిలుస్తుంది. పెడన వాణిజ్య కేంద్రం కావడం ఒక కారణమైతే బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల ప్రజలకు ఈరైల్వేస్టేషన్ అందుబాటులో ఉండడం మరో కారణం. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సౌకర్యాల పరంగా చూస్తే అంతగా లేవని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి బయలుదేరే బీదర్, ధర్మవరం,సాయినగర్ శిర్డి ఎక్స్ప్రెస్ రైళ్లలో పెడన నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైలు కోచ్లకు అనుగుణంగా ఫ్లాట్ఫాం పొడవు లేకపోవడంతో జనరల్, స్లీపర్ కోచ్ల్లోని ప్రయాణికులు ట్రాక్ వెంబడి ఉన్న రాళ్లపై నుంచి ఎక్కి దిగాల్సి వస్తోంది. ఎక్స్ప్రెస్ రైళ్ల కోచ్లు ఫ్లాట్ఫాంపై ఎక్కడ ఆగుతాయో తెలిపే డిజిటల్ డిస్ప్లే బోర్డులు లేక ప్రయాణికులు రైలు ఆగిన తర్వాత తమ కోచ్ కోసం ఫ్లాట్ఫాంపై పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక ఫ్లాట్ఫాంపై రూఫ్ కొంతభాగం మాత్రమే ఉండడంతో వర్షం కురిస్తే ఇబ్బందులు తప్పడంలేదు.
పార్కింగ్ లేక అవస్థలు: ఇతర ప్రాంతాల నుంచి పెడనకు బైక్లపై వచ్చి రైళ్లలో రాకపోకలు సాగించే వారికి పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్కింగ్కు కాంట్రాక్టర్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. పార్కింగ్ భవనంలో ఉంచిన బైక్లు చోరీకి గురైన సంఘటనలు కూడా వెలుగుచూశాయి.
హాల్టింగ్ లేక: మచిలీపట్నం నుంచి వారంలో మూడు సార్లు వెళ్లే మచిలీపట్నం-యశ్వంత్పూర్, ప్రతి సోమవారం వెళ్తోన్న తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లకు పెడనలో హాల్టింగ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి ఈరెండు రైళ్లకు వెళ్లాల్సిన వారు గుడివాడ లేదా మచిలీపట్నం వెళ్లి రైళ్లను ఎక్కాల్సి వస్తోంది. ఈ రెండు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని దీర్ఘకాలంగా ప్రయాణికులు అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నా స్పందన లేదు.
నిరుపయోగంగా పార్కింగ్ భవనం
అధికారులు ఏమంటున్నారంటే..
దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం