ఏళ్లు గడిచాయి.. ఇళ్లు నిలిచాయి
ఏళ్లు గడిచిపోతున్నా.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పునాదుల దశలో కొన్ని చోట్ల, అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లు మరికొన్ని చోట్ల కనిపిస్తున్నాయి.
జగనన్న కాలనీల్లో వసతుల లేమి
నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారులు
పెద కరగ్రహారంలో ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే : ఏళ్లు గడిచిపోతున్నా.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పునాదుల దశలో కొన్ని చోట్ల, అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లు మరికొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. బందరు మండలంలో కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎక్కడా పూర్తిగా ఇళ్లు నిర్మించిన దాఖలా లేదు. కనీస వసతులు లేకుండా ఇళ్లు ఎలా నిర్మించుకోవాలంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
అన్ని చోట్లా అధ్వానమే...
- నగరంలోని వివిధ డివిజన్ల ప్రజలకు చినకరగ్రహారంలో 15 వేల మందికిపైగా స్థలాలు కేటాయించారు. ఇప్పటికీ చాలామంది ఇళ్లు నిర్మించుకోలేదు. గ్రామాల్లో లేఔట్లు చూస్తే అన్ని చోట్లా అధ్వానంగా ఉన్నాయి. సుల్తానగరం ప్రజలకు పొలాల మధ్యలో స్థలాలు కేటాయించారు. మెరక చేయకపోవడంతో వర్షం వస్తే మోకాలి లోతు నీళ్లు చేరిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒకరిద్దరు మాత్రమే ఇళ్లు నిర్మించుకోగా.. కొందరు అసంపూర్తిగా వదిలేశారు. చాలామంది ఇక్కడ ఇళ్ల నిర్మాణం అంటేనే హడలిపోతున్నారు.
- చిట్టిపాలెంలో ఊరి చివర స్థలాలు ఇచ్చినా... వసతులు లేవని నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారుల ఒత్తిడితో కొంతమంది నిర్మించుకున్నా... అక్కడికి వెళ్లే దారి లేక, ఉండే అవకాశం లేక ఖాళీగా వదిలేశారు. చిన్నాపురం, ఎస్ఎన్ గొల్లపాలెం, పొట్లపాలెం, తపశిపూడి తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
- మండలంలో ఆరు వేల మందికిపైగా లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తే... వారిలో మూడో వంతు మంది కూడా ఇళ్లు నిర్మించుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేసవిలోనే ఇలా ఉందంటే.. వర్షాకాలంలో నిర్మాణానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. అసలు ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిట్టిపాలెంలో అసంపూర్తిగా గృహ నిర్మాణాలు
వసతులేవి.. నిర్మాణం ఎలా?
- స్థలాలు ఊరికి దూరంగా ఇచ్చారని, వసతులు లేవని, ఇతర కారణాలు చూపుతూ ఇళ్లు నిర్మించలేమని చాలామంది లబ్ధిదారులు అధికారులకు చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో పాటు స్వయం సంఘాల మహిళలకు అదనంగా రుణం కూడా ఇస్తామని ప్రకటించారు. ఎంత రుణం ఇచ్చినా వసతులు లేకుండా ఇళ్లు ఎలా నిర్మించాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
- పెదకరగ్రహారంలోని కాలనీలో ముళ్ల పొదలు పెరిగిపోయాయి. ప్రజలకు తాగునీరు అందించేందుకు నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకు కూడా అసంపూర్తిగానే ఉంది. అంతర్గత రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. ఏ కాలనీలో కూడా పూర్తి స్థాయిలో మెరక పనులు చేపట్టిన దాఖలాలు లేవు. చదును, అంతర్గత రోడ్ల అభివృద్ధి, తాగునీరు, విద్యుత్ తదితర వసతులు కల్పించాల్సి ఉంది. ఎక్కడా పూర్తి స్థాయిలో వసతులు లేవు. కనీసం సామగ్రి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల నీటి వసతి కోసం చేతి పంపులు వేసి వదిలేశారు. వర్షం పడితే చాలు కాలనీల్లో నీళ్లు చేరి నిల్వ ఉంటున్నాయి. ఎప్పటినుంచో సమస్య ఇలాగే ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారు. వసతులు లేక చాలామంది ఇళ్ల నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. ఎప్పుడు సౌకర్యాలు కల్పిస్తే అప్పుడే నిర్మించుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కాలనీల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
వసతుల కల్పనకు కృషి
కాలనీల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగింది. మండల వ్యాప్తంగా కాలనీల వారీగా ఎక్కడెక్కడ ఏయే వసతులు కల్పించాల్సి ఉందో నివేదిక సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
ఎ.బాలకృష్ణారావు, ఎంపీడీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం