ముందస్తు సాగునీటి విడుదల లేనట్టే?
ప్రస్తుత ఖరీఫ్ పనులు ఆరంభ వేళ.. కృష్ణా నది పరీవాహకంలో సాగునీటికి గడ్డు పరిస్థితి నెలకొంది. కృష్ణా డెల్టాకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తామని గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా..
కృష్ణా డెల్టా ఆయకట్టుకు కష్టకాలమేనా!
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రస్తుత ఖరీఫ్ పనులు ఆరంభ వేళ.. కృష్ణా నది పరీవాహకంలో సాగునీటికి గడ్డు పరిస్థితి నెలకొంది. కృష్ణా డెల్టాకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తామని గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. ఈ ఏడాది సాగునీటికి కటకట ఏర్పడింది. 2022, మే 19న సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. జూన్ 10న సాగునీటిని విడుదల చేశారు. ఆ తర్వాత సీజనులో 2023, జూన్ 6న సాగునీటి పారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించి, ఆ మరుసటి రోజే 7న సాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది రుతు పవనాలు వచ్చేస్తున్నట్టు చల్లని కబురు వినిపిస్తున్నా.. ఐఏబీ సమావేశ నిర్వహణ ఊసే లేదు. కృష్ణా నది ఎగువున పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు లేవు. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీలకు గాను, అంతంత మాత్రంగా సుమారు రెండు టీఎంసీలు మాత్రమే ఉంది. విస్తారంగా వర్షాలు పడితే తప్ప, ముందస్తుగా బ్యారేజీ నుంచి నీటి విడుదల సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి, అంతా ఓట్ల లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు జూన్ నెల ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ప్రభుత్వ పరంగా సాగునీటి విడుదల, నీటి నిల్వలు తదితరాలపై ఎలాంటి సమాచారం లభించడం లేదు. గత సీజనులో ఒక పంటకే నీరివ్వడం, ప్రస్తుత ఖరీఫ్లో ఎప్పుడు నీరిస్తారో తెలియని పరిస్థితి.
సాగర్, ఎత్తిపోతలు, చెరువులే ఆధారం.. ఎన్టీఆర్ జిల్లాలో 51,000 హెక్టార్లలో వరి సాగు విస్తీర్ణం ఉంది. నాగార్జునసాగర్, సాగునీటి చెరువులు, ఎత్తిపోతల పథకాల ఆధారంగా జిల్లాలో సాగునీటిని అందించాల్సి ఉంది.
155 టీఎంసీల నీరు అవసరం
సాగునీటి ప్రణాళిక ప్రకారం.. కృష్ణా డెల్టాకు (ఉమ్మడి కృష్ణా జిల్లాకు) సాగు, తాగు నీటి అవసరాల నిమిత్తం 155 టీఎంసీల పైచిలుకు నీరు అవసరం ఉంది. ముఖ్యంగా ఒక్క సాగునీటి అవసరాలకే 145 టీఎంసీల పైచిలుకు కావాల్సి ఉంది. పులిచింతలలో 45 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. నాగార్జునసాగర్ నుంచి నీరు వస్తేనే పులిచింతల నిండుతుంది. మరోవైపు పులిచింతల-ప్రకాశం బ్యారేజీల నడుమ కృష్ణా పరివాహకంలో అధిక వర్షాలు కురిస్తే.. బ్యారేజీకి నీరు చేరుతుంది. ఏదైనా సమృద్ధిగా వర్షాలు పడితేనే నీటి లభ్యత ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లోని కృష్ణా డెల్టాల పరిధిలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఇందులో ఎన్టీఆర్ జిల్లాకు 1,757 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ