పూడ్చకపోతే..అన్నదాతలకు కడగండ్లే
ప్రస్తుత ఖరీఫ్లో సాగునీటి పరిస్థితి ఏమిటని మునేరు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ భూభాగంలో కోతకు గురైన భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆ ప్రాంత రైతులు గత ఏడాది డిసెంబరులో పోలంపల్లి మట్టికట్టకు గండ్లు కొట్టిన విషయం తెలిసిందే.
పనులు చేసేందుకు ఇదే సమయం
మేల్కోకపోతే 16,427 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం
వత్సవాయి, పెనుగంచిప్రోలు, న్యూస్టుడే
ప్రస్తుత ఖరీఫ్లో సాగునీటి పరిస్థితి ఏమిటని మునేరు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ భూభాగంలో కోతకు గురైన భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆ ప్రాంత రైతులు గత ఏడాది డిసెంబరులో పోలంపల్లి మట్టికట్టకు గండ్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐదు నెలలైనా వాటిని అధికారులు పూడ్పించలేదు. వర్షాలు కురిసి వరద చేరితే గండ్లు పూడ్చలేని పరిస్థితి నెలకుంటుంది. వచ్చిన వరద వచ్చినట్లు దిగువకు పోతే కాలువలకు నీరందదు. ఫలితంగా సుమారు 20 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు వెంటనే స్పందించి కట్టలను బలోపేతం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఒక టీఎంసీ నిల్వ చేయాలని..
పోలంపల్లి వద్ద ఉన్న మునేరు డ్యాంకు 135 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకులు మునేరులో చిన్న ఆనకట్ట నిర్మించి 16,427 ఎకరాలకు సాగునీరు అందించారు. మూడు దశాబ్దాలుగా అప్పటి ఆనకట్టకే మరమ్మతులు చేసుకుంటూ సాగునీరు అందిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో మునేరుపై నీటి నిల్వ ప్రాజెక్ట్లు నిర్మించిన నేపథ్యంలో దిగువకు నీటి పారుదల తగ్గిపోయింది. గతంలో అన్నదాతలు రెండు పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఒక్క పంటకు కూడా సరిగా నీరందని పరిస్థితి నెలకొంది. వరద వచ్చినపుడు సుమారు 10 టీఎంసీల నీరు వృథాగా కృష్ణా నదిలో కలుస్తోంది. అందులో ఒక టీఎంసీని నిల్వ చేయాలనే ఉద్దేశంతో 2004లో అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిటిష్ ఆనకట్టకు దిగువున డ్యాం నిర్మించారు. కాంక్రీటు పనులు పూర్తి చేసి గేట్లు అమర్చకుండా వదిలేశారు. అది నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం పాత ఆనకట్ట ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.
భూములు కోతకు గురై...
2012లో వచ్చిన భారీ వరదకు కొత్త ఆనకట్ట మట్టికట్టకు గండి పడింది. దాని నుంచి వరద దిగువకు పారడంతో ఆ పక్కనే ఉన్న తెలంగాణ రైతుల భూములు కోతకు గురయ్యాయి. ఏటా వస్తున్న వరదకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. డ్యాం అసంపూర్తి పనుల వల్లే తాము నష్టపోయామని, అందుకు పరిహారం చెల్లించాలని కొంతకాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబరులో నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడే కట్టలకు రైతులు గండి కొట్టారు. ఫలితంగా డ్యాంలో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. పంటలు ఎండిపోయాయి. సమస్య పరిష్కారానికి ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు రంగంలోకి దిగారు. 36 ఎకరాలు కోతకు గురైనట్లు ఖమ్మం అధికారులు గుర్తించగా, ఎన్టీఆర్ జిల్లా అధికారులు రూ.55 లక్షల నష్ట పరిహారాన్ని అందించారు. నష్టపరిహారం చెల్లింపుపై తెలంగాణ రైతులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
నీరు రాకుంటే పంటలు పండవు
- తమ్మినేని వెంకటేశ్వర్లు(ధర్మరాజు), రైతు, పోలంపల్లి
డ్యాం వద్ద తెలంగాణ రైతులు కొట్టిన గండ్లకు అధికారులు వెంటనే పూడ్చాలి. వర్షాలు కురిస్తే పనులు చేయడం కుదరదు. గండ్లు పూడ్చకపోతే కాలువకు నీరు అందక పంటలు సాగు చేయలేం.
ఇప్పటికే ఆలస్యమైంది
- పొందూరి గోపి, రైతు, గుమ్మడిదుర్రు
ఆయకట్టులో పదెకరాల మాగాణి ఉంది. కాలువకు నీరు వస్తేనే పంటలు పండుతాయి. లేదంటే తిండి గింజలు, పశుగ్రాసానికి ఇబ్బందులు తప్పవు. అధికారులు ఇప్పటికే ఆలస్యం చేశారు. వెంటనే స్పందించాలి.
సమస్య పరిష్కారానికి కృషి
- రామకృష్ణ, మునేరు ప్రాజెక్ట్ డీఈ
తెలంగాణ రైతులకు నష్టపరిహారం చెల్లించాం. మరికొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కరించి గండ్లు పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. నీరు అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్