Crime News: రూ.1.5 కోట్లకు కుచ్చుటోపీ.. నమ్మించి మోసం చేసిన మహిళ
ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది.
బాధితుల వేదన
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే : ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది. ఈ ఘటనలో సుమారు రూ.1.5 కోట్ల వరకు మాయలేడి కాజేసినట్లు సమాచారం. బాధితుల వివరాల ప్రకారం.. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో లీలావతి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె పలు బ్యాంకుల సిబ్బందితో మాట్లాడి పలువురికి రుణాలు ఇప్పించింది. అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాల కోసం పలు గ్రూపులను తయారు చేసింది. మంజూరయ్యే రుణంలో కొంత సొమ్ము తనకు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానంటూ పలువురికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. అలా మెల్లగా వారి సొమ్ములు కాజేయడం ప్రారంభించింది. సుమారు 60 పైగా గ్రూపులను ప్రారంభించి వాటిలోని సభ్యుల నుంచి రూ.1.5 కోట్ల వరకు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. చాలా మందికి చెందిన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి విడిపించలేదని వారు వాపోతున్నారు. తమ డబ్బుల గురించి అడిగితే బ్యాంకులకు కడతానని చెప్పిందని, కానీ కట్టలేదన్నారు.
హైదరాబాద్లో లీలావతి ఇంటి ఎదురుగా మహిళల నిరసన
దీంతో బ్యాంకు సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 మందికి పైగా బాధితులు ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో లీలావతి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. లీలావతి ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటోందని తెలిసి పలువురు అక్కడకు వెళ్లారు. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధికి చెందిన 3 కాసుల ఛైన్ రూ. 65 వేలకు తాకట్టు పెట్టి పరారైందన్నారు. లీలావతి బాధితులు బాపూజినగర్, లక్ష్మీనగర్ కాలనీ, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిడ్కో కాలనీ, జగనన్న కాలనీ తదితర ప్రాంతాల్లో బాధితులు ఉన్నారు. దీనిపై తాలూకా ఎస్సై ఎన్.లక్ష్మీనరసింహమూర్తి మాట్లాడుతూ బాధితులు రెండు రోజులుగా లీలావతి అనే మహిళ మోసం చేసిందని తిరుగుతున్నారని, పూర్తి ఆధారాలతో రావాలని వారికి సూచించామన్నారు. వారంతా కలిసి వస్తానన్నారని వారు రాగానే కేసు నమోదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం