Crime News: రూ.1.5 కోట్లకు కుచ్చుటోపీ.. నమ్మించి మోసం చేసిన మహిళ
ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది.
బాధితుల వేదన
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే : ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో వెలుగు చూసింది. ఈ ఘటనలో సుమారు రూ.1.5 కోట్ల వరకు మాయలేడి కాజేసినట్లు సమాచారం. బాధితుల వివరాల ప్రకారం.. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో లీలావతి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె పలు బ్యాంకుల సిబ్బందితో మాట్లాడి పలువురికి రుణాలు ఇప్పించింది. అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాల కోసం పలు గ్రూపులను తయారు చేసింది. మంజూరయ్యే రుణంలో కొంత సొమ్ము తనకు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానంటూ పలువురికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. అలా మెల్లగా వారి సొమ్ములు కాజేయడం ప్రారంభించింది. సుమారు 60 పైగా గ్రూపులను ప్రారంభించి వాటిలోని సభ్యుల నుంచి రూ.1.5 కోట్ల వరకు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. చాలా మందికి చెందిన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి విడిపించలేదని వారు వాపోతున్నారు. తమ డబ్బుల గురించి అడిగితే బ్యాంకులకు కడతానని చెప్పిందని, కానీ కట్టలేదన్నారు.
హైదరాబాద్లో లీలావతి ఇంటి ఎదురుగా మహిళల నిరసన
దీంతో బ్యాంకు సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 మందికి పైగా బాధితులు ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో లీలావతి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. లీలావతి ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటోందని తెలిసి పలువురు అక్కడకు వెళ్లారు. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధికి చెందిన 3 కాసుల ఛైన్ రూ. 65 వేలకు తాకట్టు పెట్టి పరారైందన్నారు. లీలావతి బాధితులు బాపూజినగర్, లక్ష్మీనగర్ కాలనీ, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిడ్కో కాలనీ, జగనన్న కాలనీ తదితర ప్రాంతాల్లో బాధితులు ఉన్నారు. దీనిపై తాలూకా ఎస్సై ఎన్.లక్ష్మీనరసింహమూర్తి మాట్లాడుతూ బాధితులు రెండు రోజులుగా లీలావతి అనే మహిళ మోసం చేసిందని తిరుగుతున్నారని, పూర్తి ఆధారాలతో రావాలని వారికి సూచించామన్నారు. వారంతా కలిసి వస్తానన్నారని వారు రాగానే కేసు నమోదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి
[ 16-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. -
నడిపించే కథానాయకుడు.. నాన్న
[ 16-06-2024]
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న.. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే.. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. -
‘నా’ కన్నా.. నేను‘న్న’
[ 16-06-2024]
చిరుపలుకులకు వన్నెలు..బుడిఅడుగులకు వెన్నలు.. నడిపించే నవశక్తివి.. నను మలిచే యుక్తివి..ఓర్పునిచ్చే అండవి.. నేర్పుకూర్చే ఆప్తుడివి.. -
ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ‘మెగా’ వెలుగులు
[ 16-06-2024]
ఎన్నాళ్లో వేచిన ఉదయం... ఇన్నాళ్లకు చేరువైంది.. మెగా డీఎస్సీ రూపంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కొలువు కలలు నెరవేరే సందర్భం రానే వచ్చింది. -
చెత్తపన్నుకు చెల్లుచీటీ!
[ 16-06-2024]
చెత్తపన్ను నుంచి నగర, పట్టణవాసులకు ఉపశమనం లభించింది. అధికారంలోకి రాగానే ఈ పన్నును నిలిపేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. -
గన్నవరం విమానాశ్రయం భద్రతకు సీఐఎస్ఎఫ్
[ 16-06-2024]
గన్నవరం విమానాశ్రయం భద్రతను జులై 02 నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు అప్పగించనున్నారు. ఏపీ పోలీసులు ఇప్పటి వరకూ విమానాశ్రయం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
చంద్రబాబుకు ఎవరూ సాటిరారు
[ 16-06-2024]
ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధికి ఎవరూ సాటిరారని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. -
బాబాయ్ అని ఇల్లు గుల్ల చేశారు
[ 16-06-2024]
అది జాతీయ రహదారి పక్కన దుకాణం.. సమయం రాత్రి 10 గంటలు.. జనసంచారం ఉండే ప్రాంతం.. నిత్యం వీఐపీల తాకిడి ఉంటుంది. అలాంటి ప్రాంతంలోని ఓ దుకాణానికి వచ్చిన దుండగుడు బాబాయ్ అంటూ మాట కలిపాడు.. ఆ ఇంట్లో వృద్ధులే ఉంటారని తెలుసుకున్నాడు.. -
కాపురానికి రావడం లేదని కత్తితో దాడి
[ 16-06-2024]
భార్య కాపురానికి రావడం లేదని భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం చెవుటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామానికి చెందిన వీరిశెట్టి రంగారావుకు కృష్ణాజిల్లా ఊటుకూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన రత్నకుమారికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. -
శ్రీశ్రీ సాహిత్యం అజరామరం
[ 16-06-2024]
జన చైతన్యం ఆశిస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చిన శ్రీశ్రీ సాహిత్యం అజరామరమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. -
వైకాపా భూస్థాపితం : మాజీ ఎమ్మెల్సీ
[ 16-06-2024]
ఎన్నికల ఫలితాలతో అరాచక వైకాపా భూస్థాపితం అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. నగరంలోని మల్లికార్జునపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
-
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్8కు ఇంగ్లాండ్
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష