క్షణ క్షణం.. భయం భయం
అదో చారిత్రక వైద్య విద్యాలయం. ఎందరో విద్యార్థులు అందులో చదువుకొని నేడు ఎంతో మందికి సేవ చేస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటైన ఈ కళాశాల భవనం నేడు శిథిలావస్థకు చేరింది.
శిథిలావస్థలో ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల
న్యూస్టుడే, గుడివాడ గ్రామీణం
అదో చారిత్రక వైద్య విద్యాలయం. ఎందరో విద్యార్థులు అందులో చదువుకొని నేడు ఎంతో మందికి సేవ చేస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటైన ఈ కళాశాల భవనం నేడు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో.. గత్యంతరం లేక ఆ భవనంలోనే బిక్కుబిక్కుమంటూ తరగతులు నిర్వహిస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి నిధులోచ్చినా పనులు పూర్తికాకపోవడంతో పెచ్చులూడి పడుతున్న భవనంలోనే పాఠాలు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది.
గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లో ఆంధ్ర ప్రొవిన్షియల్ హోమియోపతిక్ వైద్య కళాశాల, హోమియో ఆసుపత్రిని స్వాతంత్య్రానికి ముందు 1945లో ప్రారంభించారు. తర్వాత కాలంలో కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్ డాక్టర్ ఎమ్.గురురాజు పేరు మీద డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలగా రూపాంతరం చెందింది. దేశంలోనే ఈ ఆస్పత్రి ఎంతో కీర్తి గడించింది. యూజీ, పీజీ కోర్సులు గల ఈ ప్రభుత్వ వైద్య కళాశాల నేడు విద్యార్థులకు కనీసం కూర్చోవడానికి సురక్షితమైన ప్రదేశం లేక కునారిల్లుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా కళాశాల ఉండగా అందులోనే తరగతి గదులు నిర్వహిస్తున్నారు. కొన్ని తరగతి గదులు, ప్రయోగశాలలు శిథిలమై ఇప్పటికే మూతబడ్డాయి. ఈ క్రమంలో తరగతి గదులు చాలక పక్కనే ఉన్న ప్రాంతీయ హోమియో పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో ఉన్న పీజీ విద్యార్థులతో కలిసి యూజీ విద్యార్థులు కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాల భవనం శిథిలమవడంతో కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకోగా 2017లో నిధులు మంజూరు చేశారు.
పైకప్పు పడిపోకుండా ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు
సగంలో ఆగిన పనులు: కొత్త భవనం నిర్మాణం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ.18 కోట్లు మంజూరు చేసింది. మార్చి 2017లో అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అయినా నేటికీ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో విద్యార్థుల కష్టాలు రెట్టింపయ్యాయి. 15 నెలల్లో పూర్తి చేస్తామని పనులు ప్రారంభించిన గుత్తేదారు కొంత కాలంగా పనులు ఆపేశారు. కొవిడ్ ప్రభావం, ఇసుక, సిమెంట్ ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల గతంలో నిర్ణయించిన ధరలకు నిర్మించలేమని.. పెరిగిన ధరలకనుగుణంగా నిర్ణయించాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దానికి అంగీకరించకపోవడంతో పనులు సగంలోనే ఆగిపోయాయి.
ప్రభుత్వానికి తెలియజేశాం
విద్యార్థుల క్షేమం దృష్ట్యా పలు తరగతి గదులు మూసి వేసి వేరే చోట తరగతులు నడుపుతున్నాం. కొత్త, పాత భవనాల పరిస్థితిపై ఆయుష్ కమిషనర్కు తెలియజేశాం. పెథాలజీ, ఫార్మసీ ల్యాబ్లలో పైకప్పు ధ్వంసం కాగా వాటిని కూడా మూతవేసి మరో చోట పనులు చేయిస్తున్నాం.
- డాక్టర్ డి.రమాదేవి, కళాశాల ప్రిన్సిపల్
ఫార్మసీ ల్యాబ్లో ఊడి పడిన పెచ్చులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ