logo

‘వైకాపా దుర్మార్గ పాలనలో అందరికీ ఇబ్బందులు’

వైకాపా దుర్మార్గపు పాలనలో అందరికీ ఇబ్బందులు తప్పవన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Published : 31 Jan 2023 04:15 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు

విజయవాడ(విద్యాధరపురం), న్యూస్‌టుడే : వైకాపా దుర్మార్గపు పాలనలో అందరికీ ఇబ్బందులు తప్పవన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ను సీఐడీ పోలీసులు విచారణకు పిలవడంతో సోమవారం ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జునపేటలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో ఆయ్యన్నపాత్రుడు మాట్లాడారు. సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలపై విజయ్‌కు సంబంధం ఉందని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారణకు న్యాయవాదితో కలిసి హాజరవుతున్నామన్నారు. విచారణ పూర్తయిన తరువాత అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రాజకీయంగా మచ్చలేని అయ్యన్న కుటంబాన్ని అణగ దొక్కేందుకు వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు.  చంద్రబాబు నేతృత్వంలో బీసీ నేతలు వైకాపా పాలనకు మంగళం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం తెదేపా నాయకులు  కార్లలో  గుంటూరు తరలి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని