నీళ్లన్నీ మాకే వదలాలి
తూర్పు కృష్ణాలో కీలకమైన కౌతవరం నీటి పారుదల లాకుల వద్ద సాగునీటి విడుదలపై వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
అధికారులపై కైకలూరు వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడి
క్యాంప్బెల్ కాల్వలో ప్రవహిస్తున్న నీరు
కౌతవరం(గుడ్లవల్లేరు), న్యూస్టుడే: తూర్పు కృష్ణాలో కీలకమైన కౌతవరం నీటి పారుదల లాకుల వద్ద సాగునీటి విడుదలపై వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రైవస్(పుల్లేరు) కాల్వకు నీటి సరఫరా నిలిపివేయడంతో కౌతవరం లాకులకు నీరు రాక బుధవారం సాయంత్రం వారాబందీలో ఇస్తున్న నీటిని పూర్తిగా నిలిపివేశారు. ఎగువ నుంచి వచ్చింది 40 క్యూసెక్కులే. అది ఏ మూలకు చాలదు. దీంతో నిబంధనల ప్రకారం లాకుల హెడ్ వద్ద బెడ్ లెవల్ను నిర్వహించాల్సి ఉంది. కానీ బుధవారం రాత్రి ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఇరిగేషన్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడంతో రాత్రికి రాత్రి కైకలూరు నియోజకవర్గానికి నీరు వెళ్లే పోల్రాజ్ కాల్వ లాకు షట్టర్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. గురువారం ఉదయం మూసివేసి మళ్లీ కైకలూరు నియోజకవర్గానికే వెళ్లే క్యాంప్బెల్ కాల్వకు నీటిని విడుదల చేశారు. లాకుల వద్దకు గురువారం దాదాపు 50 క్యూసెక్కులు రాగా అధికారులు దాన్నే విడుదల చేస్తున్నారు. ఎంత వస్తే అంత మా కాల్వలకే ఇవ్వాలని ఎమ్మెల్యే డీఎన్నార్ నీటిపారుదల అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కాల్వకు తక్కువ నీరు ఉన్నప్పుడు హెడ్ వద్ద బెడ్లెవల్ నిర్వహించాలి. దీని వలన కాల్వకు ఇరువైపులా ఉండే గ్రామాల ప్రజల అత్యవసరాలకు, అగ్నిప్రమాదాల సమయంలో ఆ నీటిని వినియోగిస్తారు. కానీ ఉన్న కాస్త నీరంతా తమ ప్రాంతానికే వదలాలంటూ వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడి తేవడంపై పలువురు విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?