కదలనున్న అక్రమాల డొంక
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహకార గృహనిర్మాణ సంఘంలో వెలుగుచూసిన అక్రమాలు నిగ్గు తేలనున్నాయి.
ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహకార గృహనిర్మాణ సంఘంలో వెలుగుచూసిన అక్రమాలు నిగ్గు తేలనున్నాయి. భూముల కొనుగోలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ బాదుడు, విచ్చలవిడి ఖర్చులు, తదితర అంశాలపై ‘ఈనాడు’లో ‘ఇల్లు లేదు.. ఘొల్లే!’, ‘ఖాతాకు కంతలు.. కళ్లకు గంతలు..!’ శీర్షికన వచ్చిన వరస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి సహకార శాఖ ఉన్నతాధికారులు స్పందించి లోతైన విచారణకు ఆదేశించారు. ఏపీ మ్యాక్స్ చట్టంలోని సెక్షన్ 29 కింద సమగ్ర విచారణకు సహకార సంఘాల రిజిస్ట్రార్ బాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ సబ్డివిజనల్ సహకార అధికారి ఎస్.శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. 120 రోజుల్లో విచారణ పూర్తి చేసి, నివేదికను అందజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సహకార అధికారి గురువారం హౌసింగ్ సొసైటీకి నోటీసు అందజేశారు.
ప్రాథమిక విచారణలో ఆధారాలు
సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలపై జిల్లా సహకార శాఖ అధికారి రెండు నెలల క్రితం ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. అందులో పలు అక్రమాలు జరిగినట్లు తేలింది. సభ్యులకు వివిధ ధరలకు ప్లాట్ల రిజిస్ట్రేషన్, 41 ప్లాట్లను సభ్యులు కాని వారికి రిజిస్ట్రేషన్, 26 ప్లాట్లను కలిదిండి కన్సెల్టెంట్లకు కేటాయింపు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము, ట్రాన్స్ఫర్ డ్యూటీ పేరుతో అధిక వసూళ్లు, తదితర అంశాలపై డీసీవో జరిపిన ప్రాథమిక విచారణలో అవకతవకలు జరిగినట్లు బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని శ్రీహరిపురం లేఔట్ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే