అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ ఆకాంక్షించారు.
వికసిత్ భారత్ సంకల్పయాత్రలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్
డిజిటల్ ప్రచార రథానికి జెండా ఊపుతున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్, పక్కనే కలెక్టర్ రాజబాబు తదితరులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ ఆకాంక్షించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగరం సుమ కన్వెన్షన్హాల్లో గురువారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో సంక్షేమ ప్రయోజనాలు పొందని వారిని గుర్తించడం, లబ్ధి పొందిన వారి అనుభవాలు పంచుకోవడం, పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా గ్రామ, పట్టణ స్థానిక సంస్థల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం చేపట్టారన్నారు. 2047 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు పూర్తయ్యే నాటికి ప్రధాని నరేంద్రమోదీ తరచూ చెబుతున్నట్లు దేశం అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతోపాటు ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపడి, అభివృద్ధి విషయంలో నగరాలు, గ్రామాల మధ్య అంతరం తొలగిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత వికసిత్ భారత్ సంకల్పయాత్ర డిజిటల్ ప్రచార రథాన్ని గవర్నర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర పథకాలపై సంబంధిత విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సందర్శించారు. నానో ఎరువులు, పురుగుమందులను డ్రోన్ల ద్వారా పంటలపై పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ ఆధ్వర్యాన ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన వారితో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ వరకూ జిల్లాలోని 491 గ్రామాలతోపాటు నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల్లో 5 ప్రచార వాహనాల ద్వారా సంకల్పయాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయల శాఖ కార్యదర్శి జి.లక్ష్మీశా కేంద్ర పథకాల అమలు వివరించారు. జడ్పీ ఛైరపర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ బ్యాంక్ ఛైర్పర్సన్ తాతినేని పద్మావతి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, మచిలీపట్నం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట