పాతాళానికి గంగమ్మ
ఇష్టానుసారంగా సాగుతున్న భూగర్భజల వినియోగం ప్రమాదకర పరిస్థితులకు చేరువ చేస్తోంది.
మరో 4 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: ఇష్టానుసారంగా సాగుతున్న భూగర్భజల వినియోగం ప్రమాదకర పరిస్థితులకు చేరువ చేస్తోంది. సాగునీటి కొరత, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వోప్లాంట్లు, విచక్షణా రహితంగా చేస్తున్న ఆక్వాసాగు, వర్షాభావ పరిస్థితులు... వంటి కారణాలు భూగర్భజల మట్టాలను పాతాళానికి పడిపోయేలా చేస్తున్నాయి. కాలానుగుణంగా పెరుగుతున్న వ్యవసాయ, పారిశ్రామిక, జనావాసాలకు అనుగుణంగా ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత లేకపోవడంతో భూగర్భ జలాలే దిక్కవుతున్న పరిస్థితి భవిష్యత్తుకు పెనుశాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కృష్ణా డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్లో 7.36 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. కృష్ణా పరిధిలో వరి సాగే ఎక్కువగా ఉన్నా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కువ శాతం మెట్టభూములు కావడంతో తక్కువ విస్తీర్ణంలో వరితో పాటు పత్తి, మిరప, మినుము, పెసర వంటి పంటల సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కృష్ణాతో పోలిస్తే ఉద్యాన పంటల సాగు ఎక్కువగానే ఉంది. మొత్తం సాగు అవసరాలకు అనుగుణంగా నీటి ప్రాజెక్టుల నుంచి సక్రమంగా నీరు ఇవ్వకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలను కాపాడుకునేందుకు భూగర్భజలాలే దిక్కయ్యాయి.
జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు పైబడి ఆక్వా సాగు ఉంది. సాధారణంగా ఉండే సాగునీటి కొరత కారణంగా అత్యధికశాతం చెరువులను నింపేందుకు భూగర్భ జలాలే అవసరమవుతున్నాయి. మరో పక్క జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆక్వా ప్లాంట్లన్నీ ఇష్టానుసారం భూగర్భజలాలను తోడేస్తున్నాయి. ఖరీఫ్సాగు ప్రారంభం నుంచి సాగునీటి సరఫరా సక్రమంగా లేదు. వర్షాభావ పరిస్థితులు వెంటాడడంతో పంటలను కాపాడుకునే క్రమంలో భూగర్భ జలాల వాడకం గరిష్ఠస్థాయికి పెరిగింది. అవసరాలకు అనుగుణంగా భూగర్భ జలాన్ని వాడుకుంటున్నా వాటిని పరిరక్షించుకునే చర్యలు లేకపోవడం సమస్యాత్మకం అవుతోంది.
యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో చల్లపల్లి చక్కెర కర్మాగారం ఆధ్వర్యాన భూగర్భ జలాలు ఛార్జింగ్ చేసుకునేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. కర్మాగారం మూతపడ్డాక పట్టించుకున్న నాధులే లేరు. ప్రకాశం బ్యారేజీ దిగువకు వరద సమయంలో మినహా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు బ్యారేజీ దిగువన నదీ పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు భూగర్భజలాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఫలితంగా సహజంగా 15 నుంచి 20 అడుగుల్లో ఉండాల్సిన నీటి ఊటలు కనుమరుగయ్యాయి. ప్రతి ఏడాది నీటి మట్టం పడిపోతుండడంతో సాధారణ మోటార్ల స్థానంలో సబ్మెర్సిబుల్ మోటార్లు వాడుకోవాల్సి వస్తోంది. మున్ముందు అవికూడా పనిచేస్తాయో లేదో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
గత ఏడాదితో పోలిస్తే...
గత ఏడాదితో పోలిస్తే కృష్ణా జిల్లా పరిధిలోని ఎనిమిది మండలాల పరిధిలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కల్గించే స్థాయికి చేరుకుంది. భూగర్భ జలవనరుల శాఖ లెక్కల ప్రకారం గడచిన నెలలో ఉయ్యూరు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, ఘంటసాల, పమిడిముక్కల, పెనమలూరు, గన్నవరం, బాపులపాడు, నందివాడ, పెడన మండలాల్లోని కొన్ని గ్రామాల్లో 2 మీటర్ల నుంచి 4.50 మీటర్లకు జలమట్టం దిగిపోయింది. భూగర్భజలాలను నిత్యావసరాలకు ఎక్కువగా వినియోగించే కానూరు గ్రామ పరిధిలో కొన్ని చోట్ల దాదాపు 23 మీటర్ల లోతుకు వెళితేనే సాధారణ జల ఆనవాళ్లు కన్పిస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మెట్టప్రాంతం ఎక్కువగా ఉండే ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగు, సాగు నీటికి ఇబ్బందులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత