పునరావాస కేంద్రాలకు 4,300 మంది
తుపాను ప్రభావిత ఏడు మండలాల పరిధిలోని 249 గ్రామాల నుంచి మంగళవారానికి 4,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. నాగాయలంక మండలంలో 19, కోడూరు 6, మచిలీపట్నం 25, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4, చల్లపల్లిలో 4 చొప్పున పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి.
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: తుపాను ప్రభావిత ఏడు మండలాల పరిధిలోని 249 గ్రామాల నుంచి మంగళవారానికి 4,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. నాగాయలంక మండలంలో 19, కోడూరు 6, మచిలీపట్నం 25, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4, చల్లపల్లిలో 4 చొప్పున పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వారికి ఉదయం అల్పాహారం, పాలు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు. నీ తుపాను ప్రభావిత మండలాల్లో ప్రాథమిక అంచనాల మేరకు 42,179 హెక్టార్లలో వరి పైరు, 690 హెక్టార్లలో వేరుశనగ పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. నాగాయలంక, మోపిదేవి, మచిలీపట్నం పరిధిలో రేకులతో నిర్మించుకున్న ఒక గృహంతో పాటు 68 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లింది.
నిత్యావసర సరకుల పంపిణీ : లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చుట్టుముట్టిన నివాస గృహాల్లోని వారికి నిత్యావసరకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు గుర్తించిన ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, వంటనూనె, బంగాళాదుంపలతో కూడిన కిట్లు అందజేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు ఇళ్లకు వెళ్లే సమయంలో కుటుంబానికి రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్నారు.
పొలాల్లో నీరు తొలగాక నష్టం లెక్కింపు: తుపాను నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీశా మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాజబాబుతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. తుపాను ప్రభావం తొలగిన అనంతరం పొలాల్లో నీరు తొలగిపోయాక పంట నష్టాన్ని లెక్కించనున్నట్టు కలెక్టర్ ఆయనకు తెలిపారు.'
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అదృష్ట అన్వేషణ
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి