ప్రయాణికులు లేక బస్సులు రద్దు
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఆర్టీసీ సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 17 శాతం...
కృష్ణాలో 20 శాతం సర్వీసుల నిలిపివేత
ఈనాడు - అమరావతి
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఆర్టీసీ సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీనికి తోడు పలు మార్గాల్లో రోడ్లపై నీరు రావడంతో ఆర్టీసీ అధికారులు సర్వీసులు రద్దు చేశారు. ఇతర రూట్లలో డిమాండ్ లేని కారణంగా సంఖ్యను కుదించారు. కొన్ని మార్గాల్లో అయితే బస్సులు పరిమితంగానే తిరుగుతున్నాయి. నడుస్తున్న సర్వీసుల్లోనూ ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.
కీలక మార్గాల్లోనూ... ఎన్టీఆర్ జిల్లాలో నిత్యం 823 ఆర్టీసీ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తుంటాయి. తుపానువేళ మంగళవారం 140 సర్వీసులను రద్దు చేశారు. డిమాండ్ లేక 17 శాతం బస్సులను నడపలేదు. సూళ్లూరుపేట - చెన్నై మార్గంలో రహదారి పైకి నీరు చేరడంతో పాటు చెన్నై నగరం నీట మునగడంతో రెండు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. బెంగళూరు నగరానికి రోజూ 8 సర్వీసులు తిరుగుతుంటాయి. నెల్లూరు, తిరుపతి రూట్లో వివిధ ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో పాక్షికంగా మూడు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఆపేశారు. విజయవాడ నుంచి గుంటూరుకు నాన్-స్టాప్ ఏసీ బస్సులు నిత్యం 9 నడుస్తుంటాయి. ఈదురుగాలుల తీవ్రతకు ఏసీ సర్వీసులకు డిమాండ్ బాగా తగ్గింది. దీంతో ఈ రూట్లో బస్సులను రద్దు చేశారు.
- విద్యా సంస్థలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించడంతో ఈ ప్రభావం ఆర్టీసీపై పడింది. జగ్గయ్యపేట డిపో నుంచి పరిసర ప్రాంతాలకు 10 పల్లెవెలుగు బస్సులను రద్దు చేశారు. విజయవాడ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులను తగ్గించారు. నిత్యం నగరం, శివారు ప్రాంతాలకు 380 సిటీ సర్వీసులు తిరుగుతుంటాయి. భారీ వర్షాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి నగరానికి షాపింగ్, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గడంతో సిటీ బస్సులకు డిమాండ్ కనిపించలేదు. దీంతో మంగళవారం 80 సర్వీసులను రద్దు చేశారు. రూట్ నెంబరు 10, 48, 23లో షెడ్యూల్స్ను బాగా కుదించారు. డిమాండ్ మేరకే నడుపుతున్నారు.
- కృష్ణా జిల్లాలో తుపాను దెబ్బకు 20 శాతం పైగా షెడ్యూల్స్ను రద్దు చేయాల్సి వచ్చింది. జిల్లాలో మొత్తం 445 సర్వీసులు వివిధ రూట్లలో రోజూ తిరుగుతుంటాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే బస్సులను నిలిపేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న దివిసీమలోని పలు మార్గాలకు సర్వీసులు రద్దయ్యాయి. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు వెళ్లాల్సిన సర్వీసులకు డిమాండ్ అంతంతనే ఉండడంతో రద్దు చేశారు. తదుపరి పరిస్థితులను బట్టి సర్వీసులను పునరుద్ధరిస్తామని అర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే