తీపి పంచేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2023-24 క్రషింగ్ సీజన్ ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. గత నాలుగైదేళ్లుగా సాగు పెంచేందుకు కేసీపీ వ్యవసాయ విభాగం, యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం కనపడలేదు
6న కేసీపీలో క్రషింగ్ ప్రారంభం
ఉయ్యూరు, న్యూస్టుడే
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2023-24 క్రషింగ్ సీజన్ ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. గత నాలుగైదేళ్లుగా సాగు పెంచేందుకు కేసీపీ వ్యవసాయ విభాగం, యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం కనపడలేదు. దీంతో ఈసారి కూడా తక్కువ విస్తీర్ణంతోనే గానుగాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో 12 లక్షల టన్నులు గానుగాడిన ఈ కర్మాగారం నేడు నాలుగు లక్షలకు పరిమితమైంది. ఒకానొక దశలో ఉయ్యూరు కర్మాగారం పరిధిలో 16 వేల మంది రైతులు చెరకు సాగు చేయగా.. నేడు ఈ సంఖ్య(మూడు కర్మాగారాల పరిధి) ఆరు వేలకు పడిపోయింది. గతంలో కేసీపీ పరిధిలో 36 వేల ఎకరాల్లో సాగవగా.. నేడు ఉమ్మడి జిల్లా పరిధిలో 11,500 ఎకరాలకు తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.
నరుకుడు, రవాణా భారం: యాంత్రీకరణ అభివృద్ధి లేనందున చెరకు నరుకుడు, రవాణా రైతుకు తలకుమించిన భారంగా మారింది. ప్రధానంగా నరుకుడుకు స్థానిక కూలీలు ఒక శాతం కూడా పనిచేయరు. 99 శాతం వలస కూలీల పైనే కర్షకులు ఆధారపడాల్సి ఉంది. ప్రస్తుత సీజన్కు ఏడు వేల మంది కూలీల అవసరం ఉంది. తూర్పు గోదావరి, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే వారు వస్తుంటారు. కూలి రేటు కూడా ఏటా పెంచేస్తుండటంతో ఆర్థికభారం పడుతోందని, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం సీజన్లో పంటకు వాతావరణం ప్రతికూల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీనికితోడు తెల్లనల్లి, కాండం తొలిచే, లద్దె, దూదేకుల పురుగుల బెడదతో దిగుబడి తగ్గే అవకాశం కనపడుతోంది.
యాజమాన్య రాయితీ, అదనపు ధరతో కలిపి టన్నుకు రూ.3464.75గా ప్రకటించారు. యూనిట్ హెడ్ సీతారామదాస్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండడం ఆందోళనకర పరిణామమన్నారు. యాజమాన్య పరంగా రైతులకు నూటికి నూరు శాతం ప్రయోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈ సాగు విస్తీర్ణం పెంచేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి