logo

కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యాభర్తల గొడవ

పూరి కూరలో ఉప్పు ఎక్కువైందని భార్య మీద భర్త కోప్పడగా... క్షణికావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...

Published : 07 Dec 2023 06:03 IST

ఆత్మహత్య చేసుకున్న భార్య

ఆటోనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: పూరి కూరలో ఉప్పు ఎక్కువైందని భార్య మీద భర్త కోప్పడగా... క్షణికావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... విజయవాడ రామలింగేశ్వరనగర్‌లోని గాయత్రి నగర్‌కు చెందిన వెంకటరమణకు తోట్లవల్లూరు మండలం గరికపర్రుకు చెందిన రమాదేవి(30)తో పదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. వెంకటరమణ ఇసుక రీచ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తారు. మంగళవారం ఉదయం ఇంట్లో టిఫిన్‌ చేస్తుండగా.. పూరి కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యాభర్తలు గొడవపడ్డారు. క్షణికావేశంలో రమాదేవి ఇనుప తీగ తీసుకొని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కాశీ విశ్వనాథ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని