ఓటరు దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కారం
ఓటరు జాబితాల సవరణల నేపథ్యంలో ఫారం-6, 7, 8ల కింద ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ డిల్లీరావు
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : ఓటరు జాబితాల సవరణల నేపథ్యంలో ఫారం-6, 7, 8ల కింద ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నగరంలోని కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు పారం-6 కింద 1,13,092 దరఖాస్తులు రాగా, వీటిలో 92,590 పరిష్కరించామని, ఇంకా 20,502 పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. ఫారం-7 కింద 1,01,634 దరఖాస్తులు రాగా, వీటిలో 91,364 పరిష్కరించామనీ, ఇంకా 10,270 పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఫారం-8 కింద 2,08,513 అర్జీలు రాగా, వీటిలో 1,91,951 పరిష్కరించారు. మరో 16,562 పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి అన్ని దరఖాస్తులను పరిష్కరించి, రానున్న జనవరి ఒకటి నాటికి తప్పులు లేని తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్కు అందజేయనున్నట్టు వెల్లడించారు. 2024, జనవరి 5న తుది ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ ప్రకటించనున్నట్టు ఆయన వివరించారు.
డిజిటల్ ఇంటి నంబర్లతో తంటా
సమావేశంలో పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్ల జాబితాల్లో గృహాలకు సంబంధించిన డిజిటల్ నంబర్లు ఉన్నాయని, దీంతో ఓటర్ల గుర్తింపు కష్టతరమవుతున్నట్టు తెలిపారు. వాటిని తొలగించి, ఇంటి నంబర్లను కేటాయించాలని కోరారు. శాశ్వతంగా వలస వెళ్లిన, మరణించిన, డబుల్ ఎంట్రీ ఓటర్లను, ఫారం-7లో గుత్తగా వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసి, జాబితాల నుంచి తొలగించాలని కలెక్టర్కు విన్నవించారు. సమావేశంలో డీఆర్వో ఎస్.వి.నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ సి.హెచ్.దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, పార్టీల ప్రతినిధులు ఎల్.శివరామప్రసాద్ (తెదేపా), పి.వి.శ్రీహరి (భాజపా), కె.కల్యాణ్ కుమార్ (సీపీఎం), పి.ఏసుదాసు (కాంగ్రెస్), వై.ఆంజనేయరెడ్డి (వైకాపా), ఎం.వినోద్కుమార్ (బీఎస్పీ), కె.పరమేశ్వరరావు (ఏఏపీ) తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే