రైతుల గుండెలు పగిలాయి
మిగ్జాం తుపాను బీభత్సానికి వాటిల్లిన తీవ్ర నష్టంతో అన్నదాతల గుండెలు పగిలాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తుపాను నష్టంపై మాజీ మంత్రి వేదన
మొర్సుమిల్లిలో రైతులతో కలిసి నష్టపరిహారం ఇవ్వాలని నినాదాలు చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు
మైలవరం, న్యూస్టుడే: మిగ్జాం తుపాను బీభత్సానికి వాటిల్లిన తీవ్ర నష్టంతో అన్నదాతల గుండెలు పగిలాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లిలో వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులతో నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి మొద్దునిద్ర వీడి ఇకనైనా బయటకు వచ్చి నష్టాన్ని పరిశీలించాలని డిమాండు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఆదుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రకటించిన పరిహారాన్ని ప్రతి రైతుకు అందించాలన్నారు. మిర్చికి ఎకరానికి రూ.1.5 లక్షలు, పత్తికి రూ.30 వేలు, వరికి రూ.30 వేల వరకు కర్షకులు పెట్టుబడులు పెట్టారని, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. నేలవాలిన పంటను కోయాలంటే ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, దిగుబడులు బాగా తగ్గిపోతాయన్నారు. చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారని, కూలీలకు పనులు లేవన్నారు. పట్టెడన్నం పెట్టే రైతు విలవిల్లాడుతున్నారని వాపోయారు. తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన హుద్హుద్, తిత్లీ తుపానుల సమయంలో అన్నదాతలను బాగా ఆదుకున్నట్లు గుర్తుచేశారు. ఇంట్లో కూర్చుంటే ఏం తెలియదని, ముఖ్యమంత్రి బయటకు రావాలని నినదించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి, నష్ట పరిహారం అంచనాలు సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రైతులను ఆదుకోవాలని తమ అధినేత పార్టీని ఆదేశించారన్నారు. గ్రామాల్లోకి అధికారులు వెంటనే రావాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసే సాయాన్ని చంద్రబాబు చెబుతున్నారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు