logo

చెరువుకి నీటి మళ్లింపుపై వైకాపా వర్గాల కొట్లాట

చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన వైకాపా పీఏసీఎస్‌ ఛైర్మన్‌ పేరం నాగిరెడ్డి, సర్పంచి డొక్కు నాగేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారని ఆ పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షుడు శీరం వెంకటసత్యనారాయణ(నాని) తెలిపారు.

Published : 07 Dec 2023 06:11 IST

ఆస్పత్రిలో క్షతగాత్రుడు నాగిరెడ్డి

చల్లపల్లి, న్యూస్‌టుడే: చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన వైకాపా పీఏసీఎస్‌ ఛైర్మన్‌ పేరం నాగిరెడ్డి, సర్పంచి డొక్కు నాగేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారని ఆ పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షుడు శీరం వెంకటసత్యనారాయణ(నాని) తెలిపారు. అదే పార్టీకి చెందిన గ్రామస్థులు కొందరు రెండు రోజులుగా కురిసిన వర్షం నీటిని పంచాయతీ చెరువులోకి మళ్లిస్తున్నారు. గ్రామంలో ఏ పనులు చేయాలన్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా తామే చేయాలని.. తమను కాదని మీరు చేయడం ఏంటని పీఏసీఎస్‌ ఛైర్మన్‌, సర్పంచి పనులను అడ్డుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది వారిద్దరిపై దాడికి పాల్పడ్డారని వెంకటసత్యనారాయణ తెలిపారు. క్షతగాత్రుడైన పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని