logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లి శివారు హెచ్‌సీఎల్‌ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

Published : 08 Dec 2023 03:34 IST

మృతుడు కృష్ణప్రసాద్‌

కేసరపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లి శివారు హెచ్‌సీఎల్‌ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉంగుటూరు మండలం ఆత్కూరుకు చెందిన మేనుగుల కృష్ణప్రసాద్‌(24), కొమ్ము కిరణ్‌లు విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై గన్నవరం బయలుదేరారు. మార్గమధ్యలోని హెచ్‌సీఎల్‌ వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణప్రసాద్‌ పైనుంచి వ్యాను వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని