కృష్ణా పాలసమితి సేవలు అమూల్యం
పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు.
యూనిట్లో ప్రధాన యంత్రాన్ని ఆరంభిస్తున్న చినజీయర్స్వామి
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే : పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. ఆ తర్వాత గోదావరి, కావేరి నదుల వెంబడి దానంతట అదే వ్యాపిస్తుందన్నారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో బాపులపాడు మండలం వీరవల్లిలో ‘ప్రాజెక్టు కామధేను’ పేరుతో నిర్మించిన అధునాతన యూనిట్ను గురువారం ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. దాదాపు రూ.160 కోట్ల వ్యయంతో, 20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. 1.50 లక్షల మంది పాడిరైతుల భాగస్వామ్యంతో విజయ డెయిరీని నిర్వహిస్తున్నారని చెప్పారు. అధిక ధర చెల్లించడం, ఏడాదికి మూడు సార్లు బోనస్ అందజేయడం, పాడిరైతుల సంక్షేమానికి డెయిరీ కృషిచేస్తోందని చెప్పారు. సంస్థ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు కృషితో ఈ పురోగతి సాధ్యమైందన్నారు. పశుపోషణ పవిత్రమైన వృత్తి అని, పాలు తల్లికి ప్రత్యామ్నాయం వంటివని చినజీయర్ వ్యాఖ్యానించారు. చలసాని మాట్లాడుతూ.. ఆరు లక్షల లీటర్ల సామర్థ్యంతో నూతన యూనిట్ని నిర్మించినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితుల నడుమ.. రెండేళ్ల వ్యవధిలో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మాణం పూర్తయిందన్నారు. పశు పోషణను లాభసాటి ఉపాధి మార్గంగా తీర్చిదిద్దడం, సంస్థకు వచ్చే మొత్తంలో 80 శాతం పాడిరైతులకే తిరిగి ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నూతన యూనిట్ని ఒక దేవాలయంగా భావిస్తున్నామన్నారు. ఈ ఏడాది రెండో విడతగా రైతులకు ఇచ్చే బోనస్ (రూ.12,26,43,687) నమూనా చెక్కుని చినజీయర్ ద్వారా పంపిణీ చేశారు. పాలకవర్గాన్ని, ఉద్యోగులను చినజీయర్ సత్కరించి ఆశీస్సులు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతు నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమాప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, లంక సురేంద్రబెనర్జీ, చలసాని ఆంజనేయులను సన్మానం చేశారు. విజయ డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వర్బాబు, జీఎం అనిల్కుమార్, డైరెక్టర్లు దాసరి బాలవర్థనరావు, ఎర్నేని సీతాదేవి, అర్జా వెంకట నగేష్, వేమూరి సాయి, చలసాని చక్రపాణి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం