దిశ మారలేదు.. ఘోరాలు ఆగలేదు..
‘దిశ యాప్ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు.
అతివలపై నేరాల్లో జిల్లాకు ప్రథమ స్థానం
జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘దిశ యాప్ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. రికార్డు స్థాయిలో మొబైళ్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేయించామని జబ్బలు చరచుకునే ప్రభుత్వ పెద్దల మాటల డొల్లతనాన్ని ఎన్సీఆర్బీ గణాంకాలు బయటపెట్టాయి. ఇటీవల జాతీయ నేర గణాంక సంస్థ వార్షిక నేర నివేదిక - 2022ను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో మహిళలపై దాడులు పెరిగిన వైనాన్ని ఈ గణాంకాలు కళ్లకు కట్టాయి. వారానికో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. చిన్నారులపై నేర ఘటనలకు సంబంధించిన కేసుల్లోనూ ఇదే తీరు. రాష్ట్రంలోనే అత్యధికంగా 554 కేసులు ఎన్టీఆర్ జిల్లాలోనే నమోదయ్యాయి. హత్యల్లో జిల్లా రాష్ట్రంలోనే ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాది మొత్తం 48 హత్యలు జరిగాయి. దాడి ఘటనలు కూడా ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇందులోనూ ఆయుధాలతో దాడి చేసినవే 975 ఉండడం గమనార్హం. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, వినియోగం పెరగడంతో ఈ కేసుల సంఖ్య 89కు ఎగబాకింది. జిల్లాలో దళితులపై దాడులు ఆగడం లేదు. ఎస్సీలపై గత ఏడాది 81 నేరాలు జరిగాయి. 13 మంది ఎస్సీ మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో ఎనిమిది మంది బాధితులు బాలికలే కావడం గమనార్హం. ఎస్టీలపై నేర ఘటనలు 15 చోటుచేసుకున్నాయి. ఇందులో రెండు అత్యాచార ఘటనలు ఉన్నాయి.
ఆడవారిపై రోజుకు...6
ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అతివలపై నేర ఘటనలు అధికంగా నమోదు అయ్యాయి. రాష్ట్ర్రంలోనే అన్ని జిల్లాల కంటే ఎక్కువగా 2,366 ఘటనలు జరిగాయి. రోజుకు ఆరు పైగా చోటుచేసుకోవడం మహిళలకు రక్షణ, భద్రత లోపించిన అంశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇంటా, బయటా అతివలకు రక్షణ లేకుండా పోయింది. భర్త, బంధువుల చేతిలో హింసకు గురైన ఘటనలు 1,204 నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సొంత మనుషులే దాడికి పాల్పడుతున్నారు. వివిధ కారణాలతో కిడ్నాప్ చేసిన కేసులు 60 ఉన్నాయి. అత్యాచార ఘటనలు 51 జరిగాయి. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన ఘటనలు 17 చోటుచేసుకున్నాయి. బాలికలపై లైంగిక దాడుల ఘటనల సంఖ్య కూడా అమాంతం పెరిగింది. 152 మంది బాలికలు అత్యాచారానికి గురి కాగా 198 మంది లైంగిక వేధింపులకు గురయ్యారు.
కనిపించకుండా పోతున్నారు
ఇంట్లో విభేదాలు, ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం తదితర కారణాలతో కనిపించకుండా పోతున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో మహిళలతో పాటు పురుషులు కూడా ఉండడం గమనార్హం. కమిషనరేట్లో గత ఏడాది మొత్తం 1,347 మంది కనిపించకుండా పోయారు. వీరిలో పురుషులు 486 కాగా, అత్యధికంగా మహిళలు 861 మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఈ తరహా కేసులపై అనుశీలన సరిగా ఉండకపోవడమే సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. తప్పిపోతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, బాలికలే ఉంటున్నారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలే కారణం. తల్లిదండ్రుల మధ్య సఖ్యత సరిగా లేకపోవడం, పిల్లలపై ఆలనాపాలనా కొరవడడం, దురలవాట్లకు గురై ఇంటి నుంచి పారిపోతున్నారు. ఇది యుక్త వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారం కూడా కారణమవుతోంది. ఇది యువతుల్లో ఎక్కువగా ఉంటోంది. ఇంట్లో వారు తమ ప్రేమను తిరస్కరించడంతో బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కూడా గణనీయ సంఖ్యలోనే కారణాలుగా ఉంటున్నాయి. పలువురి మోసగాళ్ల బారిన పడి గృహిణులు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇటువంటి వారి జాబితాలో పురుషులు కూడా ఉంటున్నారు.
గత ఏడాది మహిళలపై నేరాల తీరిది..
మొత్తం ఘటనలు: 2,366
భర్త, బంధువుల దాడి: 1,204
ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా దాడి: 408
కించపర్చడం : 167
పోక్సో కేసులు: 412
అత్యాచారాలు: 51
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్